ఇక అలాగే 'వందే భారత్ మిషన్' కింద సెంట్రల్ గవర్నమెంట్ గత మే నుంచి దైపాక్షిక 'ఎయిర్ బబుల్' ఏర్పాట్ల కింద ఎంపిక చేసిన దేశాలకు ప్రత్యేక అంతర్జాతీయ విమానాలను నడుపుతోంది. ఇంతవరకూ అమెరికా, యూకే, యూఏఈ, కెన్యా, భూటాన్, ఫ్రాన్స్ సహా 27 దేశాలతో ద్వైపాక్షిక ఎయిర్ బబుల్ ఒప్పందాలను ఇండియా చేసుకుంది. అయితే, కరోనా వైరస్ సెకెండ్ వేవ్ నేపథ్యంలో, పలు దేశాలు కోవిడ్ పరిస్థితి మెరుగయ్యేంతవరకూ ఎయిర్ బబుల్ ఒప్పందం కింద ఇండియా నుంచి వచ్చే విమానాలపై నిషేధం విధించాయి. కాగా, తమ అనుమతి పొందిన అంతర్జాతీయ కార్పో ఆపరేషన్లు, విమానాలపై ఈ ప్రభావం ఉండదని డీజీసీఏ తాజా సర్క్యులర్లో పేర్కొంది.ఇక ఇండియాలో కోవిడ్ కేసులు విజృంభిస్తున్న దృష్ట్యా వచ్చే మూడు వారాలు అన్ని డైరెక్ట్ ప్యాసింజర్ ఫ్లయిట్స్ను సస్పెండ్ చేస్తున్నట్టు ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్ తాజాగా ప్రకటించడం జరిగింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి