ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుగులేని చరిష్మా ను కొనసాగించిన తెలుగుదేశం పార్టీ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత మాత్రం అటు ఆంధ్రాలో అధికారంలోకి వచ్చినప్పటికీ తెలంగాణలో మాత్రం మళ్ళీ పుంజూకోలేక పోయింది.  లాగిపెట్టి నేలకేసి కొట్టినట్లుగా మళ్లీ నేలమీద నుండి లేవలేక పోయింది టిడిపి పార్టీ. ఎన్ని ప్రయత్నాలు చేసినా అడుగడుగున నిరాశ చెందాల్సిన  పరిస్థితి ఏర్పడింది. అయితే తెలంగాణలో టిడిపి పార్టీ పూర్తిగా కనుమరుగయ్యింది అని చెప్పాలి. అయితే ఇక తెలుగుదేశం పార్టీలో ఉన్న ఎర్రబెల్లి దయాకర రావు, రేవంత్ రెడ్డి లాంటి కీలక నాయకులు పార్టీని వదిలి వెళ్లినప్పటికీ పార్టీ తెలంగాణ అధ్యక్షుడిగా ఉన్న రమణ మాత్రం పార్టీతోనే ఉన్నారు.



 అయితే ఎల్.రమణ టిడిపి పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పటికీ అటు వరుసగా ఎన్నికల్లో ఆయనకు ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ఇక ఇటీవల ఏకంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా పోటీ చేశారు ఆయన. అయితే ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఎల్.రమణ కు నిరాశే ఎదురైంది కేవలం ఐదు వేల ఓట్లతో మాత్రమే వెను తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. కేవలం ఎమ్మెల్సీ ఎన్నిక మాత్రమే కాదు జీహెచ్ఎంసీ ఎన్నిక, స్థానిక ఎన్నికలు అప్పుడెప్పుడో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఇలా ఎన్నికల్లో కూడా తుడిచిపెట్టుకుపోయింది టిడిపి పార్టీ.



 అయితే ఇక ఎన్నో రోజుల నుంచి టీడీపీ పార్టీలో కొనసాగుతున్న ఎల్.రమణ మరికొన్ని రోజుల్లో టిఆర్ఎస్ పార్టీలో చేరబోతున్నారు అనే టాక్ వినిపిస్తోంది. ఎందుకంటే ఇటీవలే టిఆర్ఎస్ పార్టీలో బలమైన బిసి నాయకుడిగా ఉన్న ఈటెల బయటకు వెళ్లిపోయారు. ఈ క్రమంలోనే ఇక మళ్ళీ బీసీ ఓటు బ్యాంకును తనవైపు తిప్పుకునేందుకు బీసీ నేత అయిన ఎల్.రమణ టీఆర్ఎస్ పార్టీలోకి తీసుకురావాలని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వ్యూహం పన్నుతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిన తర్వాత ఎల్.రమణ కు ఎమ్మెల్సీ ఇచ్చే అవకాశం కూడా ఉంది అనే టాక్ వినిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: