ప్రస్తుతం వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రపంచవ్యాప్తంగా కూడా ఎంతో వేగంగా కొనసాగుతోంది. ఓవైపు కరోనా వైరస్ రూపాంతరం చెందుతూ విజృంభిస్తున్న తరుణంలో ఇక అందరికీ వ్యాక్సిన్ అందిస్తే ఎలాంటి ప్రాబ్లం ఉండదు అని భావిస్తున్న అన్ని దేశాల ప్రభుత్వాలు తమ తమ దేశాలలో వ్యాక్సిన్ ప్రక్రియను వేగంగా ప్రణాళికాబద్ధంగా నిర్వహిస్తున్నారు.  అయితే ఒకప్పుడు కరోనా విజృంభిస్తున్న సమయంలో వ్యాక్సిన్ తొందరగా వస్తే బాగుండు అని కోరుకున్న జనాలు ఇక ఇప్పుడు వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత మాత్రం టీకా వేసుకోడానికి ముందుకు రావడం లేదు.



 దీంతో వేగంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి చేయాలి అని అనుకుంటున్న ప్రభుత్వ లక్ష్యానికి తూట్లు పడుతున్నాయి.  ఇక ప్రజలందరినీ వ్యాక్సిన్ వేసుకోవడానికి బ్రతిమిలాడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ క్రమంలోనే కొన్ని దేశాల ప్రభుత్వాలు వినూత్న నిర్ణయాలు తీసుకుంటూ వ్యాక్సిన్ తీసుకునేందుకు ప్రోత్సహించేలా ఎన్నో ఆఫర్లు సైతం ప్రకటిస్తున్నాయ్. ఇటీవల కాలంలో కూడా ఇలాంటి తరహా ఆఫర్ ప్రకటించినట్లు తెలుస్తోంది.హాంకాంగ్ నగరంలో వ్యాక్సినేషన్ పూర్తిచేసినవారికి ఖరీదైన కార్లను గోల్డ్ బార్లను అందించేందుకు సిద్ధమయ్యాయి కార్పొరేట్ సంస్థలు. మొత్తం వ్యాక్సిన్ వేసుకునేందుకు ప్రజలు ఆసక్తి చూపకపోవడంతో ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.



 ఇప్పటికి హాంగ్ కాంగ్ లోని పలు కార్పొరేట్ సంస్థలు వ్యాక్సిన్ వేసుకున్న తమ ఉద్యోగులకు సిబ్బందికి కూడా కొన్ని రకాల లేటరీలు నగదు బహుమతులు లాంటివి ప్రకటించాయి. ఇక ఇటీవల సినో గ్రూప్కి చెందిన చారిటీ విభాగం వ్యాక్సింగ్ చేసుకున్న వారికి వినూత్నమైన ఆఫర్లు ప్రకటించారు గత నెలలో వ్యాక్సింగ్ చేసుకున్న వారికి 1.4 మిలియన్ అపార్ట్మెంట్ బహుమతిగా అందిస్తామని వెల్లడించారు.  ఇక మరో కంపెనీ ఇటీవలే మరో ప్రోత్సాహకాలను కూడా ప్రకటించింది. వ్యాక్సిన్ తీసుకున్న వారి పేర్లు అన్ని ఒకచోట చేర్చి లాటరీ తీస్తామని లాటరీ విజయం సాధించిన వారు ఏకంగా తెస్లా కారును సొంతం చేసుకోవచ్చు అంటూ ఒక ఆఫర్ ప్రకటించింది .

మరింత సమాచారం తెలుసుకోండి: