ఇప్పటికే కరోనా వైరస్ కారణంగా ఉపాధి లేక సామాన్యుడు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నాడు. ఇలాంటి సమయంలో అటు నిత్యావసరాల ధరలు కూడా భారీగా పెరిగిపోయాయి.. ఏల్పీజి గ్యాస్ సిలిండర్ ధరలు కూడా ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇలాంటి సమయంలో అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్ర స్థాయిలో పెట్రోల్ డీజిల్ ధరలను పెంచుతూ ఉండటం మాత్రం సంచలనంగా మారిపోయింది. అయితే ప్రస్తుతం పెట్రోల్ డీజిల్ ధరలు దేశంలో సెంచరీ దాటిపోయాయి. దీంతో సామాన్య ప్రజలపై భారం ఎంతగానో పడుతుంది. అత్యవసరం అయితే తప్ప వాహనాన్ని బయటకు తీయడం లేదు పేద మధ్య తరగతి ప్రజలు.
అయితే దేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు భారీగా పెరిగిపోవడంతో ఇటు ప్రతిపక్ష పార్టీలు కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నాయి. ఇక తాజాగా మహారాష్ట్ర మంత్రి అశోక్ చవాన్ పెరుగుతున్న పెట్రోల్ ధరలపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు దేశంలో పెట్రోల్ కంటే లిక్కర్ ఎంతో చీప్ గా దొరుకుతుంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో పెట్రోల్ ధరలు రెండు రూపాయలు పెంచితే ప్రతిపక్షంలో ఉన్న బిజెపి నిరసనకు దిగింది. కానీ ఇప్పుడు బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం పెట్రోల్ ధరలు సెంచరీ దాటిపోయాయి. మరోవైపు ఎల్పిజి సిలిండర్ ధరను కూడా మూడు రేట్లు పెరిగాయి అంటూ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు అశోక్ చవాన్. వీటి వల్ల అటు నిత్యావసరాల ధరలు కూడా పెరిగి సామాన్యుడి పరిస్థితి ఎంతో భారంగా మారిపోతున్నాయి అంటూ వ్యాఖ్యానించారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి