ఇటీవలి కాలంలో యువతీ యువకుల మధ్య ప్రేమ చిగురించడం అనేది సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది. కొంతమంది సోషల్ మీడియా వేదికగా ఏర్పడిన పరిచయం కారణంగా ప్రేమించుకుంటే.. మరికొంతమంది తోటి స్నేహితులను ప్రేమిస్తూ ఉంటారు. అయితే నేటి రోజుల్లో యువతీ యువకులు ప్రేమించుకోవడం ఎంత కామన్ గా మారిపోయిందో ఇక అదే యువతీయువకులు చిన్నచిన్న కారణాలకే బ్రేకప్ చెప్పుకోవడం కూడా అంతే కామన్ గా మారిపోయింది.  ఇక ప్రేమించేటప్పుడు ఐ లవ్ యూ అని ఎంత సింపుల్గా చెప్పేస్తారో.. ఇక వద్దు అనుకున్నపుడు కూడా అంతే సింపుల్గా బ్రేకప్ చెప్పేస్తారు.



 ఇలా బ్రేకప్ చెప్పిన తర్వాత యువతీయువకులు ఇద్దరూ కూడా లవ్ ని లైట్ తీసుకొని మరొక యువతి యువకుడు తో ప్రేమ కొనసాగించడం లాంటివి చేస్తున్నారు. అయితే కొంత మంది మాత్రం ఇక లవ్ బ్రేకప్ జరిగిన సమయంలో ఎంతగానో డిప్రెషన్ కు లోనై ఇక మనస్తాపం చెందుతున్నారు. మరి కొంతమంది ఏకంగా ఆత్మహత్యలు చేసుకోవడం లాంటివి కూడా చేస్తున్నారు. అయితే సాధారణంగా సినిమాల్లో ఇలా బ్రేకప్ చెప్పిన సమయంలో హీరో ఎంతో ఫీలైపోయి కనిపించిన వస్తువుల పగలగొట్టడం లాంటివి చేస్తూ ఉంటారు. నిజ జీవితంలో  ఇలా పగలగొడితే ఎవరైనా ఊరుకుంటారా.



 కానీ ఇక్కడ ఒక యువకుడు మాత్రం ఇలాంటి బీభత్సం సృష్టించాడు. తన ప్రేయసి లవ్ బ్రేకప్ చెప్పింది అనే కారణంతో ఏకంగా ఓ యువకుడు బీభత్సం సృష్టించాడు. 15 కార్లను ద్వంసం చేసాడు. ఈ ఘటన బెంగళూరులో వెలుగులోకి వచ్చింది. ఉదయం లేచేసరికి కారు డ్యామేజ్ కనిపించడంతో వెంటనే స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేపట్టారు. సీసీ కెమెరాలను పరిశీలించగా యువకుడు కారు అద్దాలు పగలగొట్టిన్నట్లు గుర్తించారు. అతన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారించగా ఆసక్తికర విషయం చెప్పాడు. తన ప్రేయసి బ్రేకప్ చెప్పడంతో గుండెపగిలి పోయిందని ఆ కోపంతోనే కార్ల అద్దాలు ధ్వంసం చేశారు అంటూ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: