అయితే... తాజాగా ఇలాంటి ఘటనే ఆప్ ఎమ్మెల్యేకు జరిగింది. దేశ రాజధాని ఢిల్లీ లోని రాజీందర్ నగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే మరియు ఆమ్ ఆద్మీ నాయకులు ఏండల్ రాఘవ్ చద్ధాకు అమ్మాయిల్లో చాలా ఫాలోయింగ్ ఉన్న సంగతి విధితమే. గతంలో ఎన్నికల జరిగినప్పుడు.. ఏండల్ రాఘవ్ చద్ధా ఎన్నికల ప్రచారం చేస్తే... ఆ సమయంలోనే చాలా మంది అమ్మాయిలు... అతనికి ప్రపోజ్ చేశారట. అయితే.. వాటన్నింటిని ఏండల్ రాఘవ్ చద్ధా అస్సలు పట్టించు కోకపోగా.. ప్రజా సేవ ముందు అంటూ ముందుకు సాగాడు.
అయితే.. ఇప్పడు పంజాబ్ ఎన్నికల బీజీలో ఏండల్ రాఘవ్ చద్ధా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే.. ఆయనకు ఓ అమ్మాయి నుంచి వింత ఘటన ఎదురైంది. పంజాబ్ ఎన్నికల్లో తమ పార్టీ అంటే ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి వస్తే... ప్రతి ఇంటికి 300 యూనిట్ల ఫ్రీ కరెంటు ఇస్తామని ఆమ్ ఆద్మీ అధినేత కేజీవాల్ ప్రకటించారు. ఈ ప్రకటనను వారం రోజుల కిందనే ఆమ్ ఆద్మీ అధినేత కేజీవాల్ చేశారు. అయితే.. ఈ హామీని ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రస్తావించారు ఏండల్ రాఘవ్ చద్ధా. అంతేకాదు.. తన ట్విట్టర్ వేదికగా... ట్వీట్ కూడా చేశారు ఆయన.
అయితే.. దీనిపై పంజాబ్ కు చెందిన కీర్తి ఠాకూర్ అనే యువతి వింతగా స్పందించిది. తనకు రాఘవ్ చద్దా కావాలని.. విద్యుత్ అస్సలు వద్దంటూ పరోక్షంగా రాఘవ్ చద్ధాకు ప్రపోజ్ చేసింది ఆ పంజాబ్ యువతి. దీంతో ఆ ట్వీట్ వైరల్ అయింది. ఈ నేపథ్యంలో రాఘవ్ తన స్టైల్ లో ఆ యువతి కి సమాధానం ఇచ్చాడు. తాను ఎన్నికల మ్యానిఫెస్టో లేనని పేర్కొన్న రాఘవ్.. ఉచిత విద్యుత్ మాత్రం ఉందన్నాడు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి