దేశ ప్రజల నమ్మకాన్ని వమ్ము చేస్తూ అందరి ప్రాణాలను ప్రమాదంలో పెట్టాడు ఆప్ఘనిస్థాన్ అధ్యక్షుడు ఘని.  తాలిబన్లను ధైర్యంగా ఎదుర్కొంటాం అంటూ అందరిలో మనో ధైర్యాన్ని నింపే విధంగా స్టేట్మెంట్లు ఇచ్చి తాలిబన్లు కాబుల్ నీ స్వాధీనం చేసుకోగానే దేశాన్ని వదిలి పారిపోయాడు. దీంతో మాకు దేశ అధ్యక్షుడు ఉన్నాడు అని ధైర్యంతో ఉన్న ప్రజలు అయోమయంలో పడి పోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇక ఆప్ఘనిస్థాన్లో తమకు రక్షణ లేదా అని ప్రస్తుతం ప్రతి ఒక్కరు దీనంగా  ఎవరు ఆదుకుంటారా అని చూస్తున్నారు. ఇలాంటి సమయంలో మీకు నేనున్నాను అంటూ మళ్ళీ ధైర్యాన్ని కలిగిస్తూ తాలిబన్లకు సైతం షాక్ ఇస్తున్నాడు ఆఫ్ఘనిస్తాన్ ఉపాధ్యక్షుడు అమృల్లా సలెహ్.


 మొన్నటి వరకు ఘని  అధ్యక్షుడిగా ఉన్న సమయంలో పాలనాపరమైన వ్యవహారాల్లో జోక్యం చేసుకోని అమృల్లా సలెహ్  ఇప్పుడు తనని తాను తాత్కాలిక అధ్యక్షుడిగా ప్రకటించుకున్నారు. అంతేకాదు ఇక ఆఫ్ఘనిస్తాన్  ప్రజలందరికీ నేనున్నాను అంటూ భరోసా ఇస్తున్నారు. తమ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుంటే చూస్తూ ఊరుకోబోము అంటూ తాలిబన్లను హెచ్చరిస్తున్నారు అమృల్లా సలెహ్. అయితే ఆఫ్ఘనిస్థాన్ అధ్యక్షుడు ఇక దేశం విడిచి పారి పోవడం తో తమకు అడ్డు అదుపూ లేదు అని అనుకున్న తాలిబన్లకు ప్రస్తుతం అమృల్లా సలెహ్ తెరమీదకు రావడంతో ఊహించని షాక్ తగిలింది అని చెప్పాలి.



 అంతేకాకుండా ఇక తన ఆధ్వర్యంలో సైన్యాన్ని తాలిబన్లపై దాడులు చేయిస్తున్నారు. తనదైన వ్యూహాలతో తాలిబన్లను ఊచకోత కోస్తూ ఉన్నట్లు ప్రస్తుతం అక్కడి మీడియా ప్రచురిస్తోంది.  ఇక ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్లో ఇప్పటికే తాలిబన్లు స్వాధీనం చేసుకున్న చారికర్ సహా పలు ప్రాంతాలను కూడా మళ్లీ ఆఫ్ఘనిస్తాన్ సైన్యం అమృల్లా సలెహ్ ఆధ్వర్యంలో తమ ఆధీనంలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో రానున్న రోజుల్లో పరిస్థితులు ఎలా మారబోతున్న అని అన్నది కూడా ఆసక్తికరంగా మారిపోయింది  ఇక ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్లో అమృల్లా సలెహ్ దూకుడుగా తాలిబన్లకు ఎదురు వెళ్తున్న తీరు చూస్తుంటే తాలిబన్లకు అసలు మొగుడు ఇతడే నేమో అని ప్రపంచ దేశాలు భావిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: