రష్యా మరియు ఉక్రెయిన్ ల మధ్య యుద్ధం స్టార్ట్ అయ్యి ఆరు రోజులు కావస్తోంది. అయితే ఇపుడప్పుడే యుద్ధం ఆగే సూచనలు ఏమీ కనబడడం లేదు. రంగంలోకి ప్రపంచంలో ఐక్యరాజ్యసమితి శాశ్వత సభ్యత్వం ఉన్న దేశాలు ఎంత ప్రయత్నిస్తున్నా రష్యా అధ్యక్షుడు పుతిన్ వినిపించుకునే స్థితిలో లేడు.  అంతే కాకుండా ఇండియా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ కూడా పుతిన్ కు ఫోన్ చేసి మాట్లాడారట. కానీ ఎంత మాట్లాడినా యుద్ధం విషయంలో తలొగ్గే ఛాన్స్ లేదంటున్నారు అని తెలుస్తోంది. అయితే ఇప్పటికే దాదాపుగా ఉక్రెయిన్ లోని ముఖ్య నగరాలను హస్తగతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఉక్రెయిన్ సైతం రష్యా సైనికులను నిలువరించడానికి ఆకాశమే హద్దుగా పోరాడుతోంది.

దేశాన్ని కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ సైనికులుగా పోరాడడానికి సిద్ధం అవుతున్నారు. ఇందులో భాగంగా ముసలి పౌరులు, సాఫ్ట్ వేర్ ఉద్యోగులు, మహిళలు సైతం గన్ లను చేతబడుతున్నారు. ప్రస్తుతం తెలుస్తున్న సమాచారం ప్రకారం రష్యా అధ్యక్షుడు పుతిన్ మరో దారుణమైన పనికి ప్రణాళిక చేస్తున్నారని ఒక అంతర్జాతీయ మీడియా ఛానెల్ చెబుతోంది. రష్యా దాడిని అడ్డుకుంటున్న ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ మరియు అతనికి సహకరిస్తున్న మరో 23 మంది ముఖ్యమైన వారిని హతమార్చేందుకు ప్రణాళికను రచిస్తున్నట్లు తెలుస్తోంది. దీనికోసం ఇప్పటికే వాగ్నర్ గ్రూప్ అనే మిలీషియా సైన్యాన్ని ఉక్రెయిన్ దేశంలోకి పంపారట.

వీరు తమ ప్లాన్ ప్రకారం అంతా సిద్ధం చేసుకుని ఉన్నారట, కేవలం మాస్కో నుండి పుతిన్ ఆదేశాలు రాగానే, తమ పని పూర్తి చేస్తారని తెలుస్తోంది. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియదు. కాగా ఈ యుద్ధం ఇంకెన్ని రోజుల వరకు జరుగుతుంది అనేది ఒక అంచనా లేదు. కాబట్టి రోజు రోజుకి ఉక్రెయిన్ సైన్యం తగ్గిపోతున్న పరిస్థితుల్లో నాటో కూటమి ఏమైనా సహాయం చేస్తుందా లేదా అమెరికా ఏమైనా నిర్ణయం తీసుకుంటుందా అన్నది తెలియాల్సి ఉంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: