ఈ మంకీ పాక్స్ భారతదేశాన్ని కూడా బాగా కలవరపాటుకు గురిచేస్తోంది. దేశంలో మంకీ పాక్స్ కేసులు అనేవి మెల్లగా పెరుగుతుండటం, రోజు రోజుకు అనుమానిత కేసుల విషయంపై ఆందోళన వ్యక్తమవుతుండటంతో కేంద్ర ప్రభుత్వం తాజాగా మార్గదర్శకాలను జారీ చేసింది.ఇక ఈ మంకీ పాక్స్ వైరస్ ఎలా సోకుతుంది, సోకినవారు, వారితో కలిసి ఉన్నవారు ఏమేం చేయాలి, ఇంకా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న అంశాలపై స్పష్టమైన సూచనలు చేసింది.కేంద్రం చేసిన సూచనలు ఇక ఇలా వున్నాయి. ఈ మంకీ పాక్స్ సోకినవారితోపాటు వారితో సన్నిహితంగా ఉన్నవారు కూడా కొన్ని రోజుల పాటు ఐసోలేషన్ లో ఖచ్చితంగా ఉండాలి. సన్నిహితంగా మెలగకున్నా కూడా ఈ వైరస్ సోకినవారితో కొంత సమయం పాటు కలిసి మాట్లాడినవారు ఇంకా కలిసి భోజనం చేసినవారు కూడా జాగ్రత్తగా ఉండాలి. మంకీ పాక్స్ సోకినవారు కచ్చితంగా 21 రోజుల పాటుగానీ, వారి శరీరంపై అయిన దద్దుర్లు/పుండ్లు పూర్తిగా తగ్గిపోయే వరకు గానీ ఖచ్చితంగా ఐసోలేషన్ లో ఉండాలి. ఈ వైరస్ సోకినవారు తమ శరీర భాగాలపై వచ్చిన దద్దుర్లు/పుండ్లను పూర్తిగా కప్పి ఉంచేలా వస్త్రాలను ఖచ్చితంగా ధరించాలి. అయితే అవి కాస్త వదులుగా ఉండి ఇంకా పుండ్లు మానిపోయేందుకు వీలయ్యేలా ఉండాలి.ఈ వైరస్ సోకినవారు, వారితో సన్నిహితంగా ఉండేవారు మూడు పొరలు ఉండే నాణ్యమైన మాస్కులు ఖచ్చితంగా ధరించాలి. 


ఈ మంకీ పాక్స్ సోకినవారుగానీ, సన్నిహితంగా మెలిగిన వారుగానీ కొంతకాలం పాటు రక్తం, ఇతర శరీర ద్రవాల దానం వంటివి అస్సలు దానం చేయకూడదు. ఈ వైరస్ సోకినవారికి జ్వరం, పుండ్లతోపాటు తలనొప్పి, గొంతు గరగర, దగ్గు ఇంకా వాపు వంటివి ఉంటాయి. ఇక వాటికి వైద్యుల సలహా మేరకు తగిన మందులను వాడాలి. మంకీ పాక్స్ సోకిన వారికి చికిత్స అందించిన, సేవలు చేసిన వైద్య సిబ్బంది కూడా 21 రోజుల పాటు ఖచ్చితంగా ప్రత్యేక పరిశీలనలో ఉండాలి. ఇక వారిలో ఎలాంటి లక్షణాలు లేకుంటే.. తగిన జాగ్రత్తలతో విధులను నిర్వర్తించవచ్చు. ఏవైనా లక్షణాలు కనుక కనిపిస్తే ఐసోలేషన్ లోకి వెళ్లి.. పరీక్షలు చేయించుకోవాలి. మంకీ పాక్స్ వైరస్ విషయంపై అతిగా ఆందోళన చెందవలసిన అవసరం అనేది లేదు. ఇది అసలు ప్రాణాపాయం కాదు. దీనికి తగిన జాగ్రత్తలు తీసుకుంటే కొన్ని రోజుల్లోనే కోలుకుని రోజువారీ జీవితం గడపవచ్చు అని కేంద్రం తన మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: