మొన్నటివరకు జనాలకు భయం గుప్పిట్లో పెట్టిన కరోనా గురించి అందరికి తెలిసిందే..ఒకవైపు వ్యాక్సిన్ ప్రక్రియ కొనసాగుతున్న కూడా మరో వైపు కేసులు కూడా పెరుగుతున్నాయి.. ప్రాణాలతో ఇప్పటికీ చాలా మంది పోరాడుతున్నారు.చైనాలో కరోనా రోజు రోజుకు పెరిగి పోతుంది.అత్యధిక కేసులు నమోదవడం ఈ నవంబర్‌, డిసెంబర్‌ నెలల్లోనే కరోనా కేసులు పెరిగాయి. వైరస్‌ వెలుగులోకి వచ్చిన తర్వాత ప్రతీసారి ఈ నెలల్లోనే వ్యాప్తి కనిపిస్తోంది. గతేడాది వెలుగులోకి వచ్చిన ఓమిక్రాన్‌ వేరియంట్ కూడా ఈ సమయంలోనే భారత్‌లో కేసులు పెరిగాయి.


ఈ మేరకు ప్రస్తుతం చైనాలో పెరుగుతోన్న కేసులు భారతదేశానికి కూడా కొత్త ముప్పుగా మారతాయా అనే ప్రశ్న తలెత్తుతోంది. భారత్‌లో కరోనా లెక్కలను పరిశీలిస్తే, గత 24 గంటల్లో 408 కొత్త కేసులు నమోదయ్యాయి. గత కొన్ని రోజులుగా, దేశంలో కోవిడ్ కేసులు అత్యల్ప స్థాయిలో ఉన్నాయి. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో పరిస్థితి అదుపులో ఉన్నాయి. ఈ వైరస్ కారణంగా మరణాలు లేవు ఆసుపత్రిలో చేరే వారు కూడా భారీగా తగ్గారు. యాక్టివ్ కేసులు కూడా 6 వేల లోపే తగ్గాయి. పాజిటివిటీ రేటు తగ్గుతోంది, రికవరీ రేటు కూడా పెరుగుతోంది.


ఒమిక్రాన్‌ కొత్త రూపంతరాల ఉనికి పెద్దగా కనిపించడంలేదు. దేశంలో కోవిడ్ అంటువ్యాధి దశలో ఉందని ఈ గణాంకాలు తెలియ చేశారు. పెళ్లిళ్ల సీజన్‌లో అప్రమత్తంగా ఉండాలని డాక్టర్‌ చెబుతున్నారు. రానున్న రోజుల్లో దేశంలో భారీగా పెళ్లిళ్లు జరగనున్న నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు. ముఖ్యంగా వృద్దులు, దీర్ఘకాలిక దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు.చైనాలో కొత్త వేరియంట్ రిపోర్ట్ వచ్చి ఉంటే, దాని వల్ల కేసులు పెరిగేవి, ఇతర దేశాలలో కూడా ప్రమాదం ఉండవచ్చు, కానీ ప్రస్తుతానికి అలాంటి అవకాశం లేదు. అందుకే చైనాలో పెరుగుతున్న కేసుల దృష్ట్యా భయపడాల్సిన అవసరం లేదు.ఏది ఏమైనా కూడా స్వీయ జాగ్రత్తలు పాటించాలని అధికారులు చెబుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: