భారీగా డబ్బులు సంపాదించాలని ఆశ ప్రతి ఒక్కరిలో ఉంటుంది అని చెప్పాలి. అయితే డబ్బులు సంపాదించేందుకు ఒక్కొక్కరు ఒక్కో మార్గాన్ని ఎంచుకుంటూ ఉంటారు. ఇక ఇటీవల కాలంలో ఉద్యోగాలు చేస్తూ కోట్ల రూపాయలు సంపాదించడం అంటే అది కేవలం కలలో మాత్రమే సాధ్యమవుతుంది. ఇక వాస్తవానికి వస్తే మాత్రం అది ముమ్మాటికి అసాధ్యం అని చెప్పాలి. అందుకే ఎంతోమంది ఇక కోట్లు సంపాదించేందుకు ఉద్యోగాల మీద ఆధారపడకుండా ఇక ఏదో ఒక విధంగా కొత్తగా ప్రయత్నాలు మొదలు పెడుతున్నారు. కొంతమంది అయితే స్టాక్ మార్కెట్ల ద్వారా కోట్ల రూపాయలు సంపాదిస్తున్న వారు కూడా ఉన్నారు.


 అయితే స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా లాభాలు ఏ రేంజ్ లో వస్తాయో ఏ మాత్రం మెడిసి కొట్టిన నష్టాలు కూడా అదే రేంజ్ లో వస్తాయి. ఉన్నది మొత్తం పోయి చివరికి రోడ్డున పడే పరిస్థితిలు కూడా వస్తాయని ఎంతోమంది నిపుణులు కూడా చెబుతూ ఉంటారు. దీంతో ఇటీవల కాలంలో ఎంతోమంది రిస్క్ లేకుండా లాటరీ టికెట్ కొనుగోలు చేసి ఇక దేవుడిపై భారం వేస్తున్నారు. ఇక కొంతమందికి అదృష్టం కలిసి వచ్చి రాత్రికి రాత్రి కోటీశ్వరులుగా మారిపోతున్నారని చెప్పాలి. ఇక్కడ ఒక వృద్ధుడికి జాక్పాట్ తగిలింది. రాత్రికి రాత్రే కోటీశ్వరుడు గా మారిపోయాడు సదరు వృద్ధుడు.


 పంజాబ్ లోని మొహాలీ జిల్లా త్రివేదిక్ క్యాంపు గ్రామంలో మహంత్ ద్వారకా దాస్ అనే వృద్ధుడు ఉంటున్నాడు. అయితే లాటరీలు అంటే అతనికి ఎంతగానో ఇష్టం. ఈ క్రమంలోనే తరచూ లాటరీ టికెట్లను కొనుగోలు చేస్తూ అదృష్టాన్ని పరీక్షించుకుంటూ ఉండేవాడు. అయితే ఇటీవల లోహ్రి నేపథ్యంలో కొన్ని రోజుల క్రితం ఒక లాటరీ టికెట్ను కొన్నాడు. అయితే ఇక ఈసారి అతనికి అదృష్టం వరించింది. ఏకంగా లాటరీలో ఐదు కోట్లు గెలుచుకున్నాడు. కాగా సదరు వృద్ధుడి కుమారుడు నరేంద్ర ప్రస్తుతం కారు డ్రైవర్గా పనిచేస్తున్నాడు  చెప్పాలి. ఈ లాటరీతో ఆ కుటుంబం ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: