ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో ఏపీలో బీజేపీ దూకుడు పెంచుతోంది. పొత్తులతో ఎలాంటి సంబంధం లేకుండా అన్ని స్థానాల్లో పోటీ చేయడమే లక్ష్యంగా బీజేపీ సమావేశాలు నిర్వహిస్తోంది. ఏపీ బీజేపీ చీఫ్‌ అయిన పురందేశ్వరి అధ్యక్షతన విజయవాడ వేదికగా మొదటి రోజు 14 జిల్లాల ముఖ్య నేతలతో సమావేశం జరిగింది.  మిగిలిన జిల్లాల నేతలతో కూడా మీటింగ్‌ జరిగింది. ఈ సమావేశాల్లో పార్లమెంట్‌ ఇంకా అసెంబ్లీ అభ్యర్థుల ఎంపికకు సంబంధించి స్క్రీనింగ్‌ చేస్తున్నారు నేతలు. ఇప్పటికే ఎన్నికల కోర్ కమిటీ, త్రి మెన్ కమిటీ ఇచ్చిన నివేదికల ఆధారంగా ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధినాయకత్వంతో పాటు జాతీయ నేతలతో కలిసి మరింత వడపోతలు చేస్తున్నారు.అయితే.. ఈ సమావేశాల్లో కూడా పొత్తు అంశం అనేది సెంటర్‌ ఆఫ్‌ అట్రాక్షన్‌గా మారింది. మొదటి రోజు సమావేశంలో పాల్గొన్న కొంతమంది బీజేపీ నేతలు పొత్తు అంశానికి సంబంధించి భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయడం పార్టీలో కన్‌ఫ్యూజ్‌ క్రియేట్‌ చేస్తోంది.


పొత్తు అంశంపై అన్ని జిల్లాల ఇన్‌ఛార్జ్‌లు ఇంకా ముఖ్య నేతల నుంచి అభిప్రాయ సేకరణ జరుగుతుందన్నారు బీజేపీ మాజీ రాజ్యసభ సభ్యులు  రమేష్‌. పొత్తు ఉంటే పరిస్థితి ఏంటి?.. లేకపోతే ఎలా ఉంటుందనే అంశాలపై చర్చించినట్లు ఆయన తెలిపారు.ఆంధ్రప్రదేశ్ లో పార్టీ బలం, అభ్యర్ధుల బలాబలాలపై చర్చించామన్నారు బీజేపీ మరో సీనియర్‌ నేత విష్ణుకుమార్‌రాజు. ఎన్నికల వ్యూహం, అభ్యర్ధుల ఎంపిక, పొత్తు అంశాలపైన కూడా ఫోకస్‌ చేసినట్లు చెప్పారు. ఇక ఇదిలావుంటే.. పొత్తుపై ఎలాంటి చర్చ జరగలేదని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిట్ర శివన్నారాయణ అన్నారు. పొత్తు ఆంశంపై నేతల అభిప్రాయాలు వారి వ్యక్తిగతమేనని ఆయన తేల్చి చెప్పారు. 25 పార్లమెంటు ఇంకా 175 అసెంబ్లీ స్థానాల్లో ఎలా పోటీ చేయాలనేదానిపైనే దృష్టి పెట్టామని చెప్పడం ఆసక్తిగా మారింది.మొత్తానికి ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపిక కోసం జరుగుతున్న బీజేపీ సమావేశాల్లో పొత్తు అంశంపై నేతల కామెంట్స్‌ కాకరేపుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: