![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/politics/politics_latestnews/assembly-electionscb5d17fa-0a18-4dd6-99cc-c14baeebaefb-415x250.jpg)
రామరాజు తన అనుచరులతో జరుపుతున్న ఆత్మీయ సమావేశాలు ఆయన్ను రెచ్చగొట్టి కావాలంటే స్వతంత్రంగా బరిలోకి దింపడానికి సన్నద్ధం చేస్తున్నారు.రామరాజు చివరిసారిగా టీడీపీ అధిష్టానానికి ఫైనల్ వార్నింగ్ జారీ చేసే ఛాన్సెస్ ఉన్నాయని తెలుస్తుంది.గత అయిదేళ్లుగా పార్టీని నియోజకవర్గంలో కాపాడుతూ వస్తున్నా నేను కావాలో లేదా రఘురామకృష్ణరాజు కావాలో తేల్చుకోమని అధిష్టానానికి వార్నింగ్ ఇచ్చారు.దాంతో రఘురామకృష్ణరాజు చేరిక అనేది టీడీపీలో రగడగా మారిందని తెలుస్తుంది.ఒకవైపు రఘురామకృష్ణరాజు వర్గం ఆయన వైసీపీతో విభేధించి టీడీపీలో నాలుగేళ్లుగా ఉన్నారని ఆయన్ని గుర్తించి టికెట్ ఇవ్వాలని లేకపోతే అది టీడీపీకి మైనస్ అవుతుందని అంటున్నారు.అయితే ఇలాంటి పరిణామాలు టీడీపీలో ఎలాంటి పరిస్థితులకి దారి చూపుతాయో టీడీపీలో భయం అనేది మొదలైందని తెలుస్తుంది.దాంతో టీడీపీకి కంచుకోటగా ఉన్న ఉండి చేజారిపోతుందనే ఆందోళన టీడీపీలో ఉంది.