![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/politics/politics_latestnews/tdp-chaing-sites-giddi-eswari-ragurama-ms-raju916e7ef0-5ca7-4651-9713-f963246e40d6-415x250.jpg)
శ్రీ సత్య సాయి జిల్లా మడకశిర రిజర్వ్డ్ నియోజకవర్గంలో ప్రస్తుత అభ్యర్థి అనిల్ కుమార్ ను మార్చి ఎస్సి విభాగం నుంచి రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్.
ఎస్ .రాజు కి కేటాయించారు. మొదట రాజుకి టికెట్ ఇవ్వాలని భావించినా అనిల్ కుమార్ కి కేటాయించడం జరిగింది. కానీ అనిల్ అభ్యర్థిత్వాన్ని మాజీ ఎమ్మెల్సీ తిప్పేస్వామి వర్గం వ్యతిరేకిస్తుండడంతో చివరికి ఎమ్. ఎస్ .రాజును ఖరారు చేశారు.
అనకాపల్లి జిల్లాలోని మాడుగుల టిడిపి అభ్యర్థిని కూడా మార్చాలని చంద్రబాబు నిర్ణయించారు
.గతంలో ఎన్ఆర్ఐ పైలా ప్రసాద్ రావుకు టికెట్ ఇవ్వగా.. ప్రచారంలో ఆయన వెనుకబడ్డారని నివేదికలు అందడంతో ప్రసాద్ రావు స్థానంలో మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి ను టిడిపి అభ్యర్థిగా ఎంపిక చేయడం జరిగింది.
ఉండి అసెంబ్లీ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా రఘురామ పోటీ చేయనున్నారు.. మొదట నర్సాపురం బిజెపి అభ్యర్థిగా చోటు దక్కుతుందని రఘురామ భావించినా ఆ పార్టీలో సభ్యత్వం లేకపోవడంతో ఆయనకు చోటు లభించలేదు అని రఘురామ ఆగ్రహం వ్యక్తం చేశారు.. ఇక రఘురామాకు టికెట్ ఇవ్వాలని టిడిపి వర్గాల నుంచి కూడా ఒత్తిడి రావడంతో నరసాపురం ఎంపీ స్థానం బీజేపీకి వెళ్లి.. ఆస్థానాన్ని వర్మ కేటాయించడంతో.. ఆ స్థానం కోసం రఘురామ తీవ్ర ప్రయత్నాలు చేశారు.. ఇక బిజెపి అభ్యర్థి శ్రీనివాస వర్మ కు ఆ పార్టీ బీఫామ్ కూడా ఇచ్చేసింది.. దీంతో రఘురామను ఉండి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయించాలని చంద్రబాబు నిర్ణయిస్తూ ఖరారు చేశారు.. ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం సోమవారం ఉదయం 11:30 కు నామినేషన్ వేయనున్నట్లు రఘురామకృష్ణరాజు ప్రకటించారు.
ఇక పాడేరు నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున గిడ్డి ఈశ్వరికి టికెట్ ఇచ్చినట్లు తెలుస్తోంది..
ఇక కాసేపట్లో అభ్యర్థులకు టిడిపి చీఫ్ చంద్రబాబు బీ- ఫామ్ లు కూడా అందజేయనున్నారు. నామినేషన్లకు ముందు ఇలాంటి పరిణామం చోటు చేసుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.