బీఆర్ఎస్ అధినేత కేసిఆర్ నిన్న మిర్యాలగూడ నుంచి బస్సు యాత్రను ప్రారంభించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇక ఈ బస్సు యాత్రలో భాగంగా మిర్యాలగూడలో కేసీఆర్ చాలా సేపు ప్రసంగించారు. అందులో కొంత భాగం అక్కడి ప్రజల గురించి తెలుసుకోక ఎక్కువ శాతం కాంగ్రెస్ పార్టీ వల్ల ప్రజలకు ఎంతో అన్యాయం జరుగుతుంది అని చెప్పుకొచ్చాడు. ఇక మిర్యాలగూడ సమావేశంలో భాగంగా కేసీఆర్ మాట్లాడుతూ... మరి కొన్ని రోజుల్లో పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయి. ఆ ఎన్నికల సందర్భంగా మళ్లీ మీ ముందుకు రావడం జరిగింది.

ప్రస్తుతం ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో. నాలుగైదు నెలల కిందట ధీమాగా ఉన్న రైతు ఈ రోజు దిగాలు పడి చాలా బాధలో ఉన్నాడు. ఆ నాడు నేను నీళ్ల కోసం , నిధుల కోసం , కరెంటు కోసం , మన ప్రజల కోసం ఉద్యమిస్తే.. 15 సంవత్సరాల పోరాటం తర్వాత బ్రహ్మాండంగా మనం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం అని కేసీఆర్ అన్నారు. ఇక ప్రజలను ఎందుకు బాధలుపెడుతున్నరు..? మిగులు కరెంటు ఉండే పద్ధతిలో మేం చేశాం. ఆ మాత్రం మీకు చేయ చేతనైతలేదా? సరఫరా జరిగిన కరెంటును అలాగే ఇవ్వచ్చు కదా? ఎందుకు ఇవ్వలేకపోతున్నారు ? మిషన్‌ భగీరథతో మంచి నీళ్లు తెచ్చి అర్బన్‌ ఏరియాలో.. మున్సిపల్‌ ఏరియాలో అన్ని వర్గాల పేదలకు దొరకాలని ఒక్క రూపాయికే నల్లా కనెక్షన్‌ ఇచ్చాం. ప్రతి ఇంట్లో నల్లా బిగించి ప్రతి ఇంటికీ నళ్లా నీరందించాం. ఇవాళ మిషన్‌ భగీరథ ఎందుకు నడుపలేకపోతున్నరు.

మీ తెలివి తక్కువ తనం ఏందీ? దయచేసి ప్రజలు ఆ విషయం గురించి బాగా ఆలోచించాలి. ఆ నాడు నీళ్ల కోసమే గోస. నాలుగైదు నెలలకే.. కేసీఆర్‌ పక్కకు జరుగంగనే ఎందుకు నీళ్లు మాయమై పోయినయ్‌ ? మీరు ఎందుకు బాధపడుతున్నరు ? సమాధానం చెప్పాలి అని కెసిఆర్ మిర్యాలగూడ ప్రజలను అడిగారు. మరికొన్ని రోజుల్లో పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయి. అందులో మీరు మీ ప్రాంతం నుండి బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించండి. మళ్ళీ అప్పుడు మన రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభావం ఎంతో ఉంది అని కాంగ్రెస్ వాళ్లకి అర్థం అవుతుంది. అది మాకు ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది అని కేసీఆర్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: