![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/politics/politics_latestnews/rayalasima-tadipatri-jc-brothers11e79c55-d8e5-46ad-b177-20ff264b3224-415x250.jpg)
ఈనెల 14వ తేదీన తాడిపత్రిలో టిడిపి నాయకుడు సూర్యముని ఇంటి పైన దాడి జరిగింది. అక్కడ పెద్ద ఎత్తున కూడా ఘర్షణలు మొదలయ్యాయి అలా ఇరువురు నేతల మధ్య ఘర్షణలు జరగడంతో జేసి ఇంట్లో పనిచేసే వారందరిని అరెస్టు చేశారు డీఎస్పీ చైతన్య.. అలాగే దివాకర్ రెడ్డి భార్య విజయమ్మ, సోదరి సుజాతమ్మ గత కొంతకాలంగా అనారోగ్యంతో మంచానికే పరిమితమయ్యారు.. వీరికి మందులు అందించే వారిని కూడా నిన్నటి రోజున తెల్లవారుజామున డిఎస్పి అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
అయితే తన తల్లి మేనత్త బాగోగులు చూసుకునేందుకు దివాకర్ రెడ్డి తనయుడు పవన్ కుమార్ రెడ్డి నిన్నటి రోజున తాడిపత్రికి రాగా పోలీసులు ఆయన పైన కూడా ఆంక్షలు విధించారు.. మీరు అసలు తాడిపత్రిలోనే ఉండకూడదని ఒకవేళ ఉంటే గృహనిర్బంధం చేస్తామంటూ కూడా పోలీసులు ఆంక్షలు విధించారు.. దీంతో పోలీసుల వద్ద వాదించినప్పటికీ చేసేదేమీ లేక చివరికి కుటుంబ సభ్యులను తీసుకొని పవన్ తాడిపత్రిని విడిచి హైదరాబాద్ కి వెళ్ళిపోయినట్లు తెలుస్తోంది. మరి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి.