అయితే ఈ విషయాలపైన కంగనా తనదైన స్టైల్ లో స్పందిస్తూ ఘాటుగానే సమాధానాన్ని ఇచ్చింది. చిరాగ్ తో సంబంధం గురించి మాట్లాడుతూ.. తనకు చాలా కాలంగా చిరాగ్ తెలుసు, అతను నాకు అత్యంత సన్నిహితుడు మిత్రుడు అంటూ తెలియజేసింది. కేవలం మా మధ్య ఉన్నది స్నేహం మాత్రమే అని మా గురించి వస్తున్న వార్తలలో ఎలాంటి నిజము లేదని, మా మధ్య ఎలాంటి ప్రేమ గాని రొమాన్స్ గాని లేవంటూ తెలియజేసింది. గతంలో కలిసి కేవలం ఒకే ఒక సినిమాలో చేసినప్పుడే ఈ బంధం ఏర్పడిందంటూ తెలియజేసింది.
ఒకవేళ మా మధ్య నిజంగానే ప్రేమ ఉండి ఉంటే ఈపాటికి మాకు వివాహమై పిల్లలు కూడా ఉండేవారు. ఇన్నాళ్లుగా మా మధ్య ఎలాంటి మార్పు రాలేదు అది ఎప్పటికీ కేవలం స్నేహంగానే కొనసాగుతుంది అంటూ రూమర్స్ ను కోట్టిపారేసింది కంగనా రనౌత్. చిరాగ్, కంగనా ఇద్దరు కలిసి 2011లో విడుదలైన మీలే నా మీలే హాయ్ అనే చిత్రంలో కలిసి నటించారు. ఈ సినిమా తర్వాత చిరాగ్ పొలిటికల్ పరంగా ఎంట్రీ ఇవ్వగా, కంగనా మాత్రం ఇండస్ట్రీలో అగ్ర హీరోయిన్గా ఎదిగింది కానీ ప్రస్తుతం అయితే ఇద్దరు కూడా పార్లమెంటు సభ్యులు గానే కొనసాగుతున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి