పూర్వం ఒక ఊళ్లో ఒక రైతు ఉండేవాడు.అతను పేద వాడే కానీ చాలా తెలివైన వాడు.ఆ చుట్టు పక్కల ఉండే వారంతా అతని సలహాల కోసం వస్తూ ఉండేవారు. ఆ ఊరికి ఒక రాజు కూడా ఉండేవారు.ఒక రోజు రాజు గారు ఆ వీధుల్లో నుంచి పోతూ ఆ రైతుని చూసారు. అతని దగ్గరకు పిలిచి నువ్వు రోజుకి ఎంత సంపాదిస్తావు,ఎంత మిగిలి ఇస్తావు,అని అడిగాడు.అందుకు ఆ రైతు మహారాజా నేను రోజుకు ఒక రూపాయి సంపాదిస్తాను, అందులో ఒక పావలా తింటాను. ఒక పావలా పిల్లలకు ఇస్తాను,ఒక పావలా అప్పు తీరుస్తాను,ఒక పావుల విసిరేస్థాను అని చెప్పాడు.


రాజుగారికి ఇదేమీ అర్థం కాలేదు.అందుకు ఆయన నువ్వు చెప్పింది నాకు అర్థమయ్యేలాగ వివరించు అని అడిగాడు ఆ రైతును.ఈ విధంగా అర్థమయ్యేలా చెప్పాడు.


నా సంపాదన నాలుగోవంతు నాకు ,నా భార్యకు తిండికోసం ఖర్చు చేస్తాను. అందుచేత మొదటి నాలుగోవంతు తినేస్తాను అని చెప్పాను. రెండవ నాలుగో వంతును మా పిల్లలకు ఖర్చు చేస్తాను..నేను  ముసలివాడిని అయ్యాక నా పిల్లలు నన్ను పోషించాలి కదా.. అందుచేత అది అప్పుడు ఇచ్చినట్లే కదా.. మూడో నాలుగో వంతు ని నా తల్లిదండ్రులకు ఖర్చు చేస్తాను.. వారు నన్ను చిన్నప్పట్నుంచి పెంచి పెద్ద వాణి చేశారు కనుక,అది వారి బాకీ చేసినట్లే కదా.నాలుగవ భాగాన్ని ధన ధాన్యాల కు ఖర్చు చేస్తాను,అంటే విసిరి వేసినట్లే కదా అన్నాడు.

రైతు చెప్పిన దాన్ని విని రాజు ఎంతో ఆనందపడ్డాడు. ఇప్పుడు నీకు ఒక షరతు విధిస్తున్నాను ..నా ముఖాన్ని వంద సార్లు చూసేదాకా ఈ సమస్యకు అర్థం ఏమిటో ఎవరికీ చెప్పకూడదు తరువాత నీకు ఒక మంచి బహుమతి ఇస్తాను అని చెప్పాడు

మర్నాడు తన దర్బారులో రైతు చెప్పిన దాన్ని ఒక సమస్యగా ఇచ్చి దాని జవాబు ను చెప్పమని కోరాడు అక్కడున్న వారిలో ఏ ఒక్కరూ చెప్పలేకపోయారు. అందుచేత రాజు .. మూడు రోజులు గడిచిన తరువాత సమాధానాన్ని చెప్పమన్నాడు.. కానీ ఏ ఒక్కరూ కూడా సరైన సమాధానం ఇవ్వలేక పోయారు. కానీ చివరకు ఆ రైతు చెప్పిన సమాధానం అందరికీ అర్థం కావడంతో రాజు గారు అతనిని మంచి బహుమతి ఇచ్చాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: