కపిలవస్తును పాలించే సోమనాథుడు పండిత, పామరులకు ఇబ్బడిముబ్బడిగా బహుమతులు ఇచ్చేవాడు. వారందరూ రాజుని గొప్ప దయ హృదయుడనీ ప్రశంసించేవారు. సరైన ప్రణాళిక లేకుండా రాజుడబ్బు అలా వృధా చేయటం నాగ దత్తుడనే మంత్రికి నచ్చేది కాదు.ఒకనాడు రాజు నాగదత్తుని పిలిచి నా అంత మంచివాడు దానశీలుడు ఈ చుట్టూ పక్కల ఎవరైనా ఉన్నారా? అని అడిగాడు. రాజా మీ దగ్గర డబ్బు ఉంది. అందుకే ఇస్తున్నారు. నలుగురి కష్టాలు తీర్చడం రాజుగా మీ బాధ్యత మీరు చేస్తున్నది దానం అనుకోలేము అని జవాబిచ్చాడు మంత్రి. అయితే అసలైన దానశీలున్ని నాకు చూపించగలవా అని అడిగాడు రాజు

 నేను మీ దగ్గరికి ఎవరిని తీసుకు రాలేను మీరే మారువేషంలో ప్రజల దగ్గరికి వెళ్తే తెలుస్తుంది. అని చెప్పాడు మంత్రి అయితే ఇద్దరం వెళ్దాం అన్న రాజు ప్రతిపాదనకు సరేనన్నాడు మంత్రి.రాజు మంత్రి మారువేషంలో గుర్రాలపై ఓ గ్రామానికి వెళ్లారు. గ్రామం మధ్యలో కొందరు కూలీలు భావి తవ్వుతూ వారికి కనిపించారు. ఇద్దరు కూలీల దగ్గరగా వెళ్లి బావి ఎవరు తవ్విస్తున్నారని అడిగారు. ఆ పక్కనే నిల్చున్న ఓ రైతు ముందుకు వచ్చి తానే ఆ బావి తవ్విస్తున్నట్లు చెప్పాడు. రాజు మంత్రి ఒకరు ముఖంలోకి ఒకరు చూసుకున్నారు. అంత డబ్బు నీకు ఎక్కడ నుంచి వచ్చింది. అని ఆ రైతుని అడిగాడు మంత్రి.


  అయ్యా రెండేళ్ల పాటు మా ఊరిలో మంచి వర్షాలు కురిశాయి. పంటలు బాగా పండాయి మంచి లాభాలు వచ్చాయి. ఈ సంవత్సరం కరువు వచ్చింది. ఊరిలో ఒక బావి మాత్రమే ఉంది. ఆ నీళ్లు అందరికీ సరిపోవటం లేదు. నేను దాచుకున్న డబ్బుతో ఊరి ప్రజల కోసం బావి తవ్వి స్తున్నాను. అని చెప్పాడు రైతు నిజమైన మంచితనం దానం అంటే ఏమిటో అప్పుడు అర్థమయ్యింది రాజుకు.

మరింత సమాచారం తెలుసుకోండి: