సచిన్ టెండూల్కర్ భారత క్రికెట్లో ప్రస్తుతం క్రికెట్ దేవుడిగా కొనసాగుతున్నాడు అన్న విషయం తెలిసిందే. అతి పిన్న వయస్కుడిగా భారత క్రికెట్లోకి అడుగుపెట్టిన సచిన్ టెండూల్కర్ ఎన్నో ఏళ్ల పాటుభారత క్రికెట్ జట్టుకు ఎనలేని సేవలు అందించాడు. అంతే కాకుండా ఎన్నో  చారిత్రాత్మక విషయాలు అందించడంలో కూడా సచిన్ టెండూల్కర్ కీలక పాత్ర వహించాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఈ క్రమంలోనే ఇక భారత క్రికెట్ దేవుడిగా మాస్టర్ బ్లాస్టర్ గా మారిపోయాడు సచిన్ టెండూల్కర్. అయితే సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ కూడా క్రికెటర్గా ప్రొఫెషన్ ప్రారంభించడంతో ఇక అభిమానుల మురిసిపోయారు.



 సచిన్ టెండూల్కర్ వారసుడు అర్జున్ టెండూల్కర్ ఇక భారత క్రికెట్లో అద్భుతంగా రాణిస్తే  అంతకంటే సంతోషం ఇంకేముంది అని సంబర పడిపోయారు అభిమానులు. కానీ మొదటి నుంచి అర్జున్ టెండూల్కర్ అభిమానుల అంచనాలను అందుకోలేక పేలవ ప్రదర్శనతో నిరాశపరిచాడు అన్న విషయం తెలిసిందే  ఇకపోతే ఇటీవలే ఐపీఎల్ కోసం అర్జున్ టెండూల్కర్ దరఖాస్తు చేసుకున్నాడు. ఒకవేళ ఎంపిక అయితే అభిమానులందరికీ అసలు సిసలైన ఆట చూసేందుకు అవకాశం వస్తుంది అని చెప్పాలి. ఇదిలా ఉంటే ఇటీవలే ఒక అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన అర్జున్ టెండూల్కర్ అభిమానులను ఆనందంలో ముంచేశాడు.



 ఇటీవలే ముంబై వేదికగా జరిగిన 73వ  పోలీస్ ఇన్విటేషన్ షీల్డ్ లో అద్భుతంగా రాణించి ప్రశంసలు అందుకున్నాడు అర్జున్ టెండూల్కర్.  ఇస్లాం జింఖానా తో జరిగిన మ్యాచ్ లో ఏకంగా 31 బంతుల్లో 77 పరుగులు చేయడమే కాదు కీలక సమయంలో మూడు వికెట్లు పడగొట్టి ఔరా అనిపించాడు. స్పిన్నర్ హషీర్  వేసిన బౌలింగ్ లో  ఏకంగా వరుసగా ఐదు సిక్సర్లు బాది అందరిని ఆశ్చర్య పరిచాడు. ఈ క్రమంలోనే ఐదు సిక్సర్లు, ఎనిమిది ఫోర్లతో ఏకంగా 31 బంతుల్లో 77 పరుగులు చేశాడు. అదే సమయంలో జట్టుకు విజయం అందించడంలో అర్జున్ టెండూల్కర్ కీలక పాత్ర వహించాడు అనే చెప్పాలి. అర్జున్ టెండూల్కర్ అద్భుతంగా రాణించడంతో అభిమానులు అందరూ మురిసిపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: