సాధారణంగా ఉత్తర భారతదేశంలో చాలా మంది జిలేబీన పెరుగుతో తినడానికి ఎంతో ఇష్టపడతారు. ఈ నేపథ్యంలోనే సెహ్వాగ్ వీరిద్దరినీ వాటితో పోల్చాడు. ‘హిట్మ్యాన్ రోహిత్, రన్ మెషిన్ విరాట్ ఓపెనింగ్ రావడం చూసినప్పుడు నాకు ఈ 'డెడ్లీ కాంబినేషన్' గుర్తుకొచ్చింది. అంటూ పెరుగు, జిలేబీ ఫొటోను తన ట్విటర్లో షేర్ చేశాడు. దీంతో ఈ ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
కాగా.. వీరూ ట్వీట్కు సోషల్ మీడియాలో నెటిజన్లు ఫిదా అవుతున్నారు. దీనికి తమ స్టైల్లో కామెంట్లు చేస్తున్నారు. ‘వీరూ.. నువ్వన్నది నిజమే.. ఇది నిజంగానే డెడ్లీ కాంబినేషన్’ అని ఓ నెటిజన్ కామెంట్ చేయగా.. మరో నెటిజన్ ‘సర్.. ఎంతైనా సచిన్-సెహ్వాగ్ అంత కాదులేండి’ అని కామెంట్ చేశాడు. ఇక మరికొందరైతే.. ‘శనివారం రోహిత్-కోహ్లీ ఓపెనింగ్, ఆదివారం సెహ్వాగ్-సచిన్ ఓపెనింగ్. ఇంతకంటే ఇంకేం కావాలి’ అంటూ రిప్లై ఇచ్చాడు. ఆదివారం శ్రీలంక లెజెండ్స్-ఇండియా లెజెండ్స్ మధ్య రోడ్ సేఫ్టీ వరల్డ్ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది.