ఐపీఎల్ మజాను మరింత పెంచేందుకు ఇక ఏకంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో రెండు కొత్త జట్లను  తీసుకు వచ్చేందుకు బిసిసీఐ నిర్ణయించింది. ఈ క్రమంలోనే ఇక ఐపీఎల్లో మెగా వేలం నిర్వహించాలని బీసీసీఐ ఇప్పటికే నిర్ణయించింది. మరికొన్ని రోజుల్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ మెగా వేలం ప్రారంభం కాబోతుంది. దీంతో ఇక ఈ మెగా  వేలంలో ఏ ఆటగాడు ఏ జట్టులోకి వెళ్ళపోతున్నాడు అన్నది మాత్రం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది. అయితే అటు ఫ్రాంచైజీలు దాదాపుగా నలుగురు ఆటగాళ్లను రిటన్ చేసుకునే అవకాశాన్ని బిసిసిఐ కల్పించింది అన్న విషయం తెలిసిందే.


 నిర్ణీత మొత్తాన్ని చెల్లించి నలుగురు ఆటగాళ్లు జుట్టుతోనే అంటి పెట్టుకునే అవకాశం ఉంది. దీంతో ఏ ఫ్రాంచైజీలు ఎవ్వరిని వదులుకో బోతున్నాయి ఎవరిని రిటైన్ చేసుకోబోతున్నాయి అన్నది కూడా హాట్ టాపిక్ గా మారిపోయింది.. ఇక ఇలాంటి పరిణామాల నేపథ్యంలో ఇటీవలే ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కీలక వ్యాఖ్యలు చేశాడు.. ఇక మరికొన్ని రోజుల్లో జరగబోయే మెగా వేలంలో ఫ్రాంచైజీ తనను రిటైన్ చేసుకునే ఆలోచనలో లేదు అంటూ రవిచంద్రన్ అశ్విన్ వ్యాఖ్యానించాడు. మెగా  వేలం గురించి ఇటీవలే రవిచంద్రన్ అశ్విన్ చేసిన వ్యాఖ్యలు కాస్త హాట్ టాపిక్ గా మారిపోయాయ్.



 ఇటీవలే తన యూట్యూబ్ ఛానల్ వేదికగా మాట్లాడిన స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఈసారి ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తనకు అవకాశం ఇచ్చే ఆలోచనలో లేదు అంటూ చెప్పుకొచ్చాడు. 2021 ఐపీఎల్ సీజన్ లో జుట్టును టేబుల్ టాపర్ గా నిలిచిన కెప్టెన్ రిషబ్ పంత్, యువ ఆటగాడు పృథ్వీ షా  దక్షిణాఫ్రికా ఆటగాడు నోర్జె వంటి  వాళ్లనే పెట్టుకునే అవకాశం ఉంది అంటూ అశ్విన్ తెలిపాడు. ముగ్గురిని రిటైన్ చేసుకోవడానికి ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం ఆసక్తి చూపుతోందని తెలిపాడు. .ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు మాజీ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ను  సైతం వదులుకొనే అవకాశం ఉంది చెప్పి షాక్ ఇచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: