హైదరాబాద్లోని ఉప్పల్లో ఉన్న రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ఎంతో ఫేమస్. ఎన్నో ఇంటర్నేషనల్ మ్యాచ్ లు ఇక ఈ స్టేడియంలో జరుగుతూ ఉంటాయి. ఇప్పటివరకు ఎన్నో కీలక మ్యాచ్ లు కూడా జరిగాయి. అయితే ఇక హైదరాబాద్లో జరిగే ఇంటర్నేషనల్ మ్యాచ్ లు అన్నీ కూడా ఇక్కడే జరుగుతూ ఉంటాయి అని చెప్పాలి. ఏదైనా మ్యాచ్ జరుగుతుంది అంటే చాలు క్రికెట్ స్టేడియం మొత్తం భారీ లైట్లతో మెరిసిపోతూ వుంటుంది. ఇలా ఎప్పుడూ భారీ లైట్లతో మెరిసిపోయే ఉప్పల్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం కాస్త ఇటీవలే పూర్తిగా చీకటి గా మారిపోయింది. పెద్ద పెద్ద లైట్లు కాదు కనీసం చిన్న లైట్లు కూడా ఎక్కడా కనిపించలేదు. దీంతో అందరూ ఒక్కసారిగా షాకయ్యారు.



 అయితే విద్యుత్ అధికారులు ఉప్పల్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం కి కరెంట్ ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. మామూలుగా అయితే కరెంట్ బిల్ ప్రతి ఒక్కరూ ప్రతి నెలా తప్పనిసరిగా కట్టవలసి ఉంటుంది.  ఒకవేళ కుదరకపోతే రెండు మూడు నెలలకు ఒకసారి అయినా కట్టుకోవాలి. అయితే ఒక వైపు కరెంటు బిల్లు  తడిసి మోపెడు అవుతున్నప్పటికీ ఇంకా కరెంటు బిల్లు కట్టడం లో నిర్లక్ష్యం వహిస్తే మాత్రం విద్యుత్ అధికారులు కరెంట్ కట్ చేసి షాక్ ఇస్తూ ఉంటారు.. ఇక ఇప్పుడు కూడా ఇదే చేశారు విద్యుత్ అధికారులు. ఏకంగా ఉప్పల్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం కి కరెంట్ కట్ చేశారు.



 ఏకంగా ఉప్పల్ స్టేడియంకు సంబంధించి కోటికి పైగా విద్యుత్ బకాయిలు ఉండడమే ఇందుకు కారణం. బిల్లులు చెల్లించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ కరెంట్ వాడుకోవడం కారణంగానే విద్యుత్ శాఖ అధికారులు ఇలా చేసి షాకిచ్చారు. అంతే కాకుండా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ పై కేసు కూడా పెట్టారు విద్యుత్ అధికారులు. అయితే ఈ క్రమంలోనే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కోర్టును ఆశ్రయించింది.  అటు కోర్టులో కూడా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కు షాక్ తగిలింది. కోర్టు తీర్పు విద్యుత్ శాఖ కు అనుకూలంగా వచ్చింది. ఇక ఆ తర్వాత విద్యుత్ అధికారులు  నోటీసులు పంపినప్పటికీ బిల్లు కట్టక పోవడంతో చివరికి కరెంట్ కట్ చేశారు అధికారులు.

మరింత సమాచారం తెలుసుకోండి: