భారత క్రికెట్ లో మహేంద్ర సింగ్ ధోనీ కి ఉన్న గౌరవం గురించి పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒక టికెట్ కలెక్టర్ స్థాయి నుంచి దేశం గర్వించే క్రికెటర్ స్థాయికి ఎదిగిన మహేంద్రసింగ్ ధోని ప్రస్థానం ప్రతి ఒక్క యువ ఆటగాడికి ఎంతో స్ఫూర్తిదాయకం అని చెప్పాలి. ఇక ఇప్పటి వరకు ఏ కెప్టెన్కు సాధ్యం కాని రీతిలో ఇక భారత క్రికెట్లో మూడు ఐసిసి ట్రోఫీలను భారత జట్టుకు అందించిన ఏకైక  కెప్టెన్ గా మహేంద్ర సింగ్ ధోనీకి ప్రత్యేక స్థానం వుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇకమహేంద్ర సింగ్ ధోనీ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ ఇప్పటికీ ధోని క్రేజ్ మాత్రం తగ్గలేదు అని చెప్పాలి.


 అయితే క్రికెట్ లో అప్పుడప్పుడే అడుగులేస్తున్న ఎంతో మంది యువ ఆటగాళ్లు మహేంద్రసింగ్ ధోని లాంటి అత్యుత్తమ ప్లేయర్ లతో ఒక్క మ్యాచ్ ఆడిన చాలు అని కోరుకుంటూ ఉంటారు. అయితే అలా కోరుకునే యువ ఆటగాళ్లకు ఐపీఎల్ కారణంగా ధోని లాంటి దిగ్గజాలతో ఆడే అవకాశం వచ్చింది అన్న విషయం తెలిసిందే. దీంతో కొన్నిసార్లు యువ ఆటగాళ్లు ఇక మైదానంలో ధోనీ కి అమితమైన గౌరవం ఇస్తూ ఉండడం కూడా చూస్తూ ఉంటాం. ఇటీవలే శివం దూబే కూడా ధోనీతో కలిసి ఆడాలనే కల నెరవేరింది అంటూ చెబుతూ ఉన్నాడు. ఇటీవల జరిగిన మెగా వేలంలో శివమ్ దూబే ను ఏకంగా నాలుగు కోట్లు వెచ్చించి దక్కించుకుంది చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం.

 అయితే యువ ఆటగాడు శివమ్ దూబే ధోని కి వీరాభిమాని అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే చెన్నై క్యాంపు లో చేరిన తర్వాత తొలిసారి మహేంద్రసింగ్ ధోని ని కలిసిన అనుభూతినీ ఇటీవల సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. ఐపీఎల్ మెగా వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ తనను దక్కించుకోవడంతో ఇక ఆనందానికి అవధులు లేకుండా పోయాయి అంటూ చెప్పుకొచ్చాడు శివమ్ దూబే. తనకు తెలియకుండానే డాన్స్ చేశాను అంటూ తెలిపాడు. ఇక మహేంద్రసింగ్ ధోని నేరుగా కలిసి మాట్లాడుతున్నప్పుడు తన రోమాలు నిక్కబొడుచుకున్నాయి అంటూ ధోనిపై  తన అభిమానాన్ని చాటుకున్నాడు శివం దూబే.

మరింత సమాచారం తెలుసుకోండి: