ఇటీవల కాలం లో ప్రపంచ క్రికెట్లో విరాట్ కోహ్లీ తర్వాత బాగా మారు మోగిపోతున్న భారత బ్యాట్స్మెన్ పేరు ఎవరిది అంటే అందరూ సూర్య కుమార్ యాదవ్ అని చెప్పేస్తూ ఉంటారు. ఎందుకంటే గత కొంతకాలం నుంచి సూర్య కుమార్ యాదవ్ ఆడుతున్న ఇన్నింగ్స్ అలాంటివి అని చెప్పడం లో అతి శయోక్తి లేదు. భారత్ తరపున అరంగేట్రం చేసిన తక్కువ సమయం లోనే అగ్రశ్రేణి బ్యాట్స్మెన్ గా పేరు సంపాదించుకున్న సూర్య కుమార్ యాదవ్ తన అటతీరుతో ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ ప్రేక్షకులను ఆకర్షిస్తూ అభిమానులను సొంతం చేసుకుంటున్నాడు.


 మైదానం లోకి వచ్చి కుదురు కోవడం కాదు రావడం రావడమే సిక్సర్లు ఫోర్లతో చెలరేగి పోతున్నాడు. మైదానం నలువైపులా కూడా అద్భుతమైన షాట్లు ఆడుతూ మిస్టర్ 360 ప్లేయర్ గా కూడా సూర్య కుమార్ యాదవ్ గుర్తింపు సంపాదించుకున్నాడు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమం లోనే తన అద్భుతమైన బ్యాటింగ్ తో ఎన్నో రికార్డులు కొల్లగొడుతున్నాడు. అయితే సూర్య కుమార్ యాదవ్ బ్యాటింగ్ చేస్తుంటే ఎంతో ఒత్తిడికి లోనయ్యాం అంటూ అటు ప్రత్యర్థి బౌలర్లు కూడా ఎన్నోసార్లు చెప్పడం చూసాము.


 ఇకపోతే ఇటీవల తన బ్యాటింగ్ తీరుపై సూర్యకుమార్ యాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.. తన దృష్టి ఎప్పుడూ జట్టును గెలిపించడం పైనే  ఉంటుంది అంటూ సూర్య కుమార్ యాదవ్ తెలిపాడు.  ఇక ఏ బౌలర్కు ఎలాంటి షాట్లు ఆడాలి అనే విషయాన్ని నెట్స్ లో ప్రాక్టీస్ చేస్తున్న సమయంలోనే గుర్తుంచుకుంటానని.. ఇక దానినే మైదానంలో అమలు చేస్తాను అంటూ తెలిపాడు. తాను బౌలర్ తో గేమ్ ఆడబోనని.. బంతితో ఆడుకోవడానికి ఇష్టపడతాను అంటూ తెలిపాడు. కాగా ప్రస్తుతం సూపర్ ఫామ్ లో ఉన్న సూర్య కుమార్ ఐసిసి టి20 ర్యాంకింగ్స్ లో నెంబర్ వన్ స్థానాన్ని సొంతం చేసుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: