ఇటీవల బంగ్లాదేశ్ పర్యటనలో భాగంగా టీమ్ ఇండియా జట్టు అటు టెస్ట్ మ్యాచ్ ఎంతో విజయవంతంగా ముగించుకుంది అన్న విషయం తెలిసిందే. ఏకంగా టెస్ట్ మ్యాచ్ లో భాగంగా ప్రత్యర్థి బంగ్లాదేశ్ కు ఎక్కడ అవకాశం ఇవ్వకుండా వరుసగా రెండు మ్యాచ్లలో విజయం సాధించి 2-0 తేడాతో క్లీన్ స్విఫ్ట్ చేసింది.ఇక ఈ విజయం ద్వారా భారత అభిమానులందరినీ కూడా సంతోషంలో ముంచేసింది అని చెప్పాలి. అయితే ఇక భారత జట్టు విజయం సాధించి రోజులు గడుస్తున్న ఇక ఈ టెస్ట్ మ్యాచ్ విజయానికి సంబంధించిన చర్చ మాత్రం ఆగడం లేదు అని చెప్పాలి. ముఖ్యంగా టీమిండియా జట్టు కష్టాల్లో ఉన్న సమయంలో చివర్లో వచ్చి అద్భుతమైన భాగస్వామ్యాన్ని నిర్మించి జట్టును గెలిపించిన శ్రేయస్, రవిచంద్రన్ అశ్విన్ జోడి పై ఎంతోమంది మాజీ ఆటగాళ్లు ప్రశంసలు కురిపిస్తూనే ఉన్నారు.



 తక్కువ టార్గెట్ మాత్రమే ఉండడంతో ఎంతో అలవోకగా టీమిండియా విజయం సాధిస్తుందని ముందుగా భావించారు టీమిండియా అభిమానులు. కానీ ఆ తర్వాత టీమిండియా బ్యాటింగ్ విభాగం పేక మెడల కూలిపోయింది. ఎంతలా అంటే 74 పరుగులకు ఏడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది టీమిండియా. దీంతో ఇక రెండవ టెస్టు మ్యాచ్లో టీమిండియా గెలవడం కష్టమే అని భావించారు. ఇలాంటి సమయంలోనే శ్రేయస్ అయ్యర్, రవిచంద్రన్ అశ్విన్ 71 పరుగుల భాగస్వామ్యంతో గెలిపించారు. బ్యాటింగ్ చేయడానికి ఎంతో కష్టంగా ఉన్న పిచ్ పై పరుగులు రాబడుతూ టీమ్ ఇండియాను విజయ తీరాలకు చేర్చారు. ఈ క్రమంలోనే రవిచంద్రన్ అశ్విన్ శ్రేయస్ అయ్యర్ జోడి ప్రపంచ రికార్డు నెలకొల్పారు.


 ఎనిమిదో వికెట్ కు 71 పరుగులు జోడించిన అయ్యర్ అశ్విన్ జోడి టీమిండియా తరఫున  టెస్టుల్లో నాలుగో ఇన్నింగ్స్ లో అత్యధిక భాగస్వామ్యం నమోదు చేసిన జాబితాలో రెండవ స్థానంలో నిలిచారు అని చెప్పాలి. అయితే ఈ లిస్టులో తొలి స్థానంలో లాలా అమర్ సింగ్ - లాల్ సింగ్ జోడి ఉన్నారు అని చెప్పాలి. 1992లో ఇంగ్లాండ్తో లార్డ్స్ వేదికగా జరిగిన టెస్ట్ మ్యాచ్లో ఈ జోడి ఎనిమిదో వికెట్ కు 74 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించారు. అయితే టీమిండియా కు ఇదే తొలి టెస్ట్ మ్యాచ్ కూడా కావడం గమనార్హం. ఇక ఆ తర్వాత మూడవ స్థానంలో కపిల్ దేవ్ - లక్ష్మణ్  శివరామకృష్ణన్ జోడి ఉన్నారు అని చెప్పాలి. 1985లో శ్రీలంకతో జరిగిన టెస్ట్ మ్యాచ్లో 8వ వికెట్ కు 70 పరుగులు జోడించింది వీరి జోడి.

మరింత సమాచారం తెలుసుకోండి: