ఇలాంటి ఎన్నో విమర్శలు వచ్చిన పట్టించుకోని విరాట్ కోహ్లీ మళ్ళీ మునుపటి ఫామ్ ను అందుకున్నాడు. ఆసియా కప్ లో ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన మ్యాచ్లో మునిపటి ఫామ్ అందుకుని మళ్లీ వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఇక ఎప్పటిలాగానే మళ్ళీ వరుస సెంచరీలతో చెలరేగిపోతున్నాడని చెప్పాలి. అయితే మొన్నటికి మొన్న బంగ్లాదేశ్ తో జరిగిన వన్డే సిరీస్లో సెంచరీ తో చెలరేగిన కోహ్లీ.. ఇప్పుడు శ్రీలంకతో జరుగుతున్న వన్డే మ్యాచ్లో సైతం సెంచరీ చేసి అదరగొట్టాడు అని చెప్పాలి. ఇటీవల జరిగిన మొదటి మ్యాచ్ లోనే కోహ్లీ సెంచరీ చేయడంతో టీమిండియా భారీ స్కోరు చేయగలిగింది.
ఈ క్రమంలోనే వన్డే మ్యాచ్లో టీమిండియా కోహ్లీ సెంచరీ చేయడం కాదు అర్థ సెంచరీ పూర్తి చేసిన సమయంలోనే ఒక అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు అని చెప్పాలి. విరాట్ కోహ్లీ కేవలం 257 ఇన్నింగ్స్ లోనే 12500 పరుగులను పూర్తి చేసుకున్నాడు. దీని బట్టి ఇక సచిన్ టెండూల్కర్ రికార్డును బ్రేక్ చేశాడు. సచిన్ టెండూల్కర్ 310 ఇన్నింగ్స్ లలో 12500 పరుగులు పూర్తి చేసుకున్నాడు అని చెప్పాలి. ఇక ఆ తర్వాత రికీ పాంటింగ్ 325 మ్యాచ్లలో 12500 పరుగుల మార్కును అందుకున్నాడు. దీంతో వన్డే ఫార్మాట్లో అత్యంత వేగంగా 12,500 పరుగులు పూర్తి చేసుకున్న ఆటగాడిగా ప్రపంచ రికార్డు సృష్టించాడు విరాట్ కోహ్లీ.