అంతేకాదు తన మెరుపు వికెట్ కీపింగ్ తో కూడా దిగ్గజ వికెట్ కీపర్ గా ఎదిగాడు అని చెప్పాలి. అయితే ధోని అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ కు రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ అతని క్రేజ్ మాత్రం ఎక్కడా తగ్గలేదు. ప్రస్తుతం భారత జట్టులో ఉన్న ఆటగాళ్లతో పోల్చి చూస్తే ధోనికే ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇక ధోని క్రేజ్ ఏ రేంజ్ లో ఉంది అన్నదానికి నిదర్శనంగా ఇక్కడ ఒక ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం శ్రీలంకతో నేడు మూడో వన్డే మ్యాచ్ ఆడుతుంది భారత జట్టు.
కేరళలోని తిరువనంతపురం గ్రీన్ ఫీల్డ్ స్టేడియంలో ఇక ఈ మ్యాచ్ జరగబోతుంది అని చెప్పాలి. అయితే ఈ సందర్భంగా ఆల్ కేరళ ధోని ఫ్యాన్స్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్టేడియం బయట 50 అడుగుల ధోని భారీ కటౌట్ ఏర్పాటు చేశారు అభిమానులు. అక్కడ జరుగుతున్న మ్యాచ్ కి ధోని కి అసలు సంబంధమే లేకపోయినప్పటికీ ఇలా తమ అభిమానాన్ని చాటుకున్నారు అని చెప్పాలి. ఈ కటౌట్ కు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారగా.. ధోని మరో 50 కొట్టేశాడు అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. కాగా ఇప్పటికే రెండు మ్యాచ్లు గెలిచి సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా మూడో మ్యాచ్లో విజయం సాధించి క్లీన్ స్వీప్ చేయాలని భావిస్తోంది.