ఇక సౌతాఫ్రికాలో జరుగుతోన్న మహిళల అండర్-19 టీ20 ప్రపంచ కప్ లో టీం ఇండియా అద్భుతమైన ఫాంలో ఒక రేంజిలో ఆడుతుంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)తో జరిగిన రెండో మ్యాచ్‌లో ఏకంగా 122 పరుగుల తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసింది.ఫస్ట్ బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి మొత్తం 219 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని  యూఏఈ జట్టు 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 97 పరుగులు మాత్రమే చేయగలిగింది.ఇక ఈ మ్యాచ్‌లో టీమిండియా మొత్తం 219 పరుగులు చేసింది. మహిళల అండర్-19 టీ20 ప్రపంచ చరిత్రలో 200 పరుగుల మార్కును దాటిన తొలి జట్టుగా భారత జట్టు రికార్డు క్రియేట్ చేసింది. ఈ ప్రపంచకప్‌లో ఏ జట్టు అయినా ఇంత పెద్ద స్కోర్ చేయడం ఇదే ఫస్ట్ టైం. భారత జట్టు తన పేరిట ఈ గొప్ప రికార్డు సృష్టించింది.


శ్వేతా సెహ్రావత్, కెప్టెన్ షెఫాలీ వర్మ ఇంకా అలాగే రిచా ఘోష్ భారత జట్టు భారీ స్కోర్ చేయడంలో చాలా కీలకంగా వ్యవహరించారు. ఈ మ్యాచ్‌లో షెఫాలీ వర్మ ఏకంగా 229.41 స్ట్రైక్ రేట్‌తో 34 బంతుల్లో 78 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ని ఆడింది. ఆమె ఇన్నింగ్స్‌లో మొత్తం 12 ఫోర్లు ఇంకా అలాగే 4 సిక్సర్లు ఉన్నాయి. ఈ ఇన్నింగ్స్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ టైటిల్‌ను కూడా అందుకుంది.ఇంకా ఇది కాకుండా ఓపెనర్ శ్వేతా సెహ్రావత్ మొత్తం 49 బంతుల్లో 10 ఫోర్లు చేసి 74 పరుగులు చేసింది. ఈ సమయంలో ఆమె స్ట్రైక్ రేట్ వచ్చేసి 151.02గా నిలిచింది.ఇంకా అదే సమయంలో వికెట్ కీపర్ రిచా ఘోష్ కూడా 29 బంతుల్లో 5 ఫోర్లు ఇంకా అలాగే 2 సిక్సర్ల సాయంతో 49 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ని ఆడింది. ఈ ఇన్నింగ్స్‌లో ఆమె స్ట్రైక్ రేట్ ఏకంగా 168.97గా నిలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి: