క్రికెట్ లో ఎందరో క్రికెటర్లు తమ ఆటతీరుతో ప్రపంచం నలువైపులా అభిమానులను సంపాదించుకున్నారు. అటువంటి క్రికెటర్లలో అప్పట్లో సచిన్ , పాంటింగ్ , లారా లు ఉన్నారు. నేటి తరం చూసుకుంటే విరాట్ కోహ్లీ, స్టీవెన్ స్మిత్, విలియమ్సన్ మరియు జో రూట్ లాంటి క్రికెటర్లు ఏలుతున్నారు. ఇప్పుడు మనము చెప్పుకున్న ఈ నలుగురు మాత్రం ఫార్మాట్ అది ఇది కాకుండా టెస్ట్ , వన్ డే మరియు టీ 20 లలో అదరగొడుతూ కుర్రాళ్లకు సవాలు విసురుతున్నారు. మాములుగా టెస్ట్ లేదా వన్ డే లలో సెంచరీ చేస్తేనే ఎంతో ప్రాధాన్యత సదరు క్రికెటర్ కు దక్కుతుంది. అలాంటిది పొట్టి ఫార్మాట్ గా భావించే టీ 20 లలో సెంచరీ చేయడం అంటే అంత ఈజీ కాదు.

కానీ వీరిలో ఒక ఆటగాడు మాత్రం టీ 20 లలోనూ సెంచరీలు సాధిస్తూ సత్తా చాటుతున్నాడు. గత సంవత్సరం డిసెంబర్ 13 వ తేదీ నుండి జరుగుతున్న బిగ్ బాష్ లీగ్ లో స్టీవెన్ స్మిత్ సిడ్నీ సిక్సర్స్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అయితే ఇతను కేవలం నాలుగు రోజుల వ్యవధిలోనే రెండు వరుస సెంచరీలు సాధించి రికార్డును సృష్టించాడు. జనవరి 17 వ తేదీన అడిలైడ్ స్ట్రైకర్స్ తో జరిగిన మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన సిడ్నీ నిర్ణీత ఓవర్ లలో వికెట్లకు 205 పరుగుల భారీ స్కోర్ ను సాధించింది.

ఇందులో ఒక్క స్టీవెన్ స్మిత్ ఒక్కడే 56 బంతుల్లో 101 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్ లో 5 ఫోర్లు మరియు 7 సిక్సులు ఉన్నాయి. ఈ మ్యాచ్ లో సిడ్నీ సిక్సర్స్ 59 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. కాగా ఈ రోజు సిడ్నీ థండర్స్ తో ఆడిన మ్యాచ్ లోనూ స్టీవెన్ స్మిత్ 66 బంతుల్లో 125 పరుగులు చేసి అజేయ సెంచరీని సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అలా ఈ టోర్నీలో ఎందరో యువఆటగాళ్లు ఉన్నా సీనియర్ ఆటగాడు స్మిత్ మాత్రం వరుస సెంచరీలు చేసి టీ 20 లలో తానూ సత్తా చాటగలనని నిరూపించాడు.          







మరింత సమాచారం తెలుసుకోండి: