ప్రస్తుతం ఆస్ట్రేలియా తో నాలుగు టెస్ట్ మ్యాచ్ల సిరీస్ ఆడుతుంది టీమిండియా జట్టు. ఈ క్రమంలోనే  ఇటీవల నాగపూర్ వేదికగా జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్ లోనే శుభారంభం చేసింది అన్న విషయం తెలిసిందే. బ్యాటింగ్ విభాగంలో బౌలింగ్ విభాగంలో బాగా రాణించిన టీమ్ ఇండియా అటు ప్రతిష్టమైన ఆస్ట్రేలియా జట్టును చిత్తుగా ఓడించింది. ఏకంగా 132 పరుగుల  తేడాతో భారత జట్టు ఘన విజయాన్ని సాధించింది అన్న విషయం తెలిసిందే. ఒకవైపు భారత స్పిన్నర్లు తమ స్పిన్ మాయాజాలంతో ఆస్ట్రేలియాను ముప్పు తిప్పలు పెడితే ఇక మరోవైపు భారత బ్యాట్స్మెన్లు ఆస్ట్రేలియా బౌలర్లతో చెడుగుడు ఆడేశారు అని చెప్పాలి.


 ఇలా పటిష్టమైన ఆస్ట్రేలియా జట్టును చిత్తుగా ఓడించిన భారత జట్టుపై ఎంతో మంది మాజీ ఆటగాళ్లు ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే సచిన్ టెండూల్కర్ సైతం టీమ్ ఇండియాను మెచ్చుకుంటూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టాడు. ఈ క్రమంలోనే భారత జట్టులో త్రిబుల్ ఆర్ ఉన్నారు అంటూ ప్రశంసలు కురిపించాడు అని చెప్పాలి. అయితే ఇక సచిన్ ప్రస్తావించిన త్రిబుల్ ఆర్ ఎవరబ్బా అని ఎంతోమంది క్రికెట్ ప్రేక్షకులు కూడా చర్చించుకుంటున్నారు.


 అయితే సచిన్ పోస్టులో తెలిపిన త్రిబుల్ ఆర్ ఎవరో కాదు.. కెప్టెన్ రోహిత్ శర్మ.. ఆల్రౌండర్ రవీంద్ర జడేజా.. స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అనే చెప్పాలి. తొలి టెస్ట్ మ్యాచ్ లో భారత్ ఆదిపత్యం చెలాయించడంలో ఈ ముగ్గురు కూడా కీలకపాత్ర వహించారు. ఒకవైపు కెప్టెన్ రోహిత్ శర్మ సెంచరీ తో కదం తొక్కితే.. మరోవైపు అశ్విన్ తన స్పిన్ మాయాజాలంతో కీలకమైన వికెట్లు పడగొట్టాడు. ఇక జడేజా బోలింగ్లో బ్యాటింగ్ లో కూడా సత్తా చాటాడు అని చెప్పాలి. ఇక ఈ ముగ్గురు అద్భుతమైన ప్రదర్శన కారణంగానే టీమిండియా భారీ పరుగుల తేడాతో విజయం సాధించగలిగింది. అందుకే ఇక త్రిబుల్ ఆర్ అని ప్రస్తావిస్తూ ప్రశంసలు కురిపించాడు సచిన్ టెండూల్కర్.

మరింత సమాచారం తెలుసుకోండి: