ఇటీవల కాలంలో భారత క్రికెట్ నియంత్రణ మండలీలో జరుగుతున్న అనూహ్యమైన మార్పులు ప్రతి ఒక్కరిని అవాక్కయ్యేలా చేస్తూ ఉన్నాయి అని చెప్పాలి  ముఖ్యంగా సౌరబ్ గంగూలీ బీసీసీఐ అధ్యక్షుడిగా తప్పుకున్న తర్వాత కొత్త అధ్యక్షుడిగా రోజర్ బిన్నీ బాధ్యతలు చేపట్టాడు. అయితే ఇక ఇప్పుడు ఇక కొత్త అధ్యక్షుడు ఆధ్వర్యంలో బీసీసీఐ షాకింగ్ నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతుంది. ఇందులో భాగంగానే ఇక అటు పాత బిసిసిఐ సెలక్షన్ కమిటీని రద్దు చేయడం కూడా ఒకటి అన్న విషయం తెలిసిందే. అయితే సెలక్షన్ కమిటీని రద్దు చేసిన తర్వాత కొత్త సెలక్షన్ కమిటీ లోకి ఎవరు వస్తారు అనే విషయం పై ఆసక్తికర చర్చ జరిగింది.



 అయితే మరోసారి చేతన్ శర్మ కే చీఫ్ సెలెక్టర్ గా బాధ్యతలు అప్పగించారు. దీంతో బీసీసీఐ కాస్త విమర్శలు కూడా ఎదుర్కొంది  ఇంతదానికే పాత సెలక్షన్ కమిటీని రద్దు చేయాల్సిన అవసరం ఏమిటి అంటూ కొంతమంది పెదవి విరిచారు. ఇదిలా ఉంటే గత కొన్ని రోజుల నుంచి వరుసగా ఇంటర్వ్యూలో పాల్గొంటున్న భారత చీఫ్ సెలెక్ట్ చేతన్ శర్మ బిసిసిఐ గురించి.. ఇక భారత క్రికెట్లో నెలకొన్న పరిస్థితుల గురించి కూడా షాకింగ్ కామెంట్స్ చేశాడు. ముఖ్యంగా చేతన శర్మ చేసిన వ్యాఖ్యలు ఆటగాళ్ల కెరియర్ ని దెబ్బతీసేలా ఉన్నాయి అని చెప్పాలి. ఇక చేతన్ శర్మ ఇలాంటి వ్యాఖ్యలు చేసిన తర్వాత అతనిపై బీసీసీఐ వేటు వేయడం ఖాయమని అందరూ భావించారు.


 అయితే అంతకుముందు గానే చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మ ఇటీవలే రాజీనామా చేశాడు అనేది తెలుస్తుంది  అయితే తన రాజీనామా లేఖను బీసీసీఐ కార్యదర్శి జై షాకు పంపించాడు చేతన్ శర్మ. ఇక జైషా కూడా ఈ రాజీనామాను ఆమోదించినట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తూ ఉన్నాయి. అయితే ఇక ఇలా బీసీసీఐలో రోజులు ఇలాంటి ఘటనలు జరగడం అందరిని షాక్ కి గురిచేస్తుంది. ఎందుకంటే బీసీసీఐ ఏరి కోరి మరి చేతన్ శర్మకే సెలక్షన్ కమిటీ బాధ్యతలను అప్పగించింది. కానీ ఇక ఇప్పుడు అతను రాజీనామా చేయడంతో అసలు ఏం జరిగిందో కూడా తెలియక కన్ఫ్యూషన్ లో పడిపోతున్నారు టీమ్ ఇండియా అభిమానులు.

మరింత సమాచారం తెలుసుకోండి: