ప్రస్తుతం ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా ప్రతి మ్యాచ్ కూడా ఉత్కంఠ భరితంగానే సాగుతుంది అని చెప్పాలి. క్రికెట్ ప్రేక్షకులకు అసలు సిసలైన ఎంటర్టైన్మెంట్ అందుతుంది. ఒక రకంగా చెప్పాలి అంటే ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో పరుగుల ప్రవాహం సాగుతూ ఉంది అని చెప్పాలి. దాదాపు అన్ని మ్యాచ్లలో కూడా ఏదో ఒక జట్టు 200 కు పైగా స్కోర్ చేస్తూ ఉండడం చూస్తూ ఉన్నాం. ఇక ఇలా అద్భుతమైన ప్రదర్శనలతో ఎంతోమంది మహిళా క్రికెటర్లు ఇక ఎన్నో అరుదైన రికార్డులను కూడా ఖాతాలో వేసుకుంటూ ఉన్నారు.


 కాగా ఈ ఏడాది ప్రారంభమైన ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో ఒక జట్టుగా కొనసాగుతున్న ముంబై ఇండియన్స్ సైతం.. ఇక ఇప్పుడు అదరగొడుతుంది అని చెప్పాలి. కాగా  ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ముంబై ఇండియన్స్ కి ఛాంపియన్ జట్టుగా పేరు ఉంది. ఎందుకంటే ఇప్పటివరకు ఏ టీం కి సాధ్యం కాని రీతిలో ఐదు సార్లు టైటిల్ గెలిచింది. అంతే కాదు ఇక ప్రతిసారి మెరుగైన ప్రదర్శన చేస్తూ దాదాపు నాకౌట్ కి అర్హత సాధిస్తూ ఉంటుంది అని చెప్పాలి. ఇక అటు ఐపీఎల్ లో మోస్ట్ సక్సెస్ఫుల్ జట్టుగా కూడా ముంబై ఇండియన్స్ కొనసాగుతూ ఉంది అని చెప్పాలి.  అయితే రాజు ఎక్కడైనా రాజే అన్న డైలాగ్ సరిగ్గా సరిపోయే విధంగా ఇక ఇప్పుడు ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో కూడా ముంబై ఇండియన్స్ ప్రస్థానం సాగుతుంది.


 ఐపీఎల్ లో ఛాంపియన్ జట్టు కొనసాగుతున్న ముంబై ఇండియన్స్ ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో కూడా అద్భుతమైన ప్రస్థానాన్ని కొనసాగిస్తుంది. ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్లలో కూడా గెలిచి హ్యాట్రిక్ కొట్టేసింది ముంబై ఇండియన్స్. ఇటీవలే ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో అలవోకగా విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ 105 పరుగులు మాత్రమే చేసింది. అయితే స్వల్ప టార్గెట్ తో బరిలోకి దిగిన ముంబై రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 15 ఓవర్లలోనే టార్గెట్ ను అందుకుంది. దీంతో ఛాంపియన్ టీం ఎక్కడైనా ఛాంపియనే అని అంటూ ముంబై ఇండియన్స్ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Epl