సాధారణంగా క్రికెట్ లో ఉన్న రూల్స్ ప్రకారమే ప్రతి ఒక్క ప్లేయర్ కూడా ఆట ఆడాల్సి ఉంటుంది అని చెప్పాలి . ఇక రిఫరీలు కూడా అందుకు తగినట్లుగానే తమ నిర్ణయాలను ప్రకటిస్తూ ఉంటారు. అయితే కొన్ని కొన్ని సార్లు క్రికెట్లో ఉండే రూల్స్ ప్లేయర్లకు లేనిపోని తలనొప్పులు తెచ్చి పెడుతూ ఉంటాయి అని చెప్పాలి. ఎంతో కష్టపడి బౌలర్ వికెట్ తీసిన సమయంలో ఇక బెయిల్ కింద పడలేదు అన్న చిన్న కారణంతో ఐసీసీ రూల్స్ ప్రకారం దానిని నాటౌట్ గా పరిగణిస్తూ ఉంటారు. దీంతో ఇక అవుట్ చేసేందుకు అద్భుతమైన బంతిని సంధించిన  బౌలర్ చివరికి నిరాశలో మునిగి పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే.


 అయితే ఇక ఇప్పటివరకు ఇక ఈ ఐసీసీ రూల్ కారణంగా ఎంతోమంది బ్యాట్స్మెన్లు వికెట్ పోకుండా బయటపడిన  వారు ఉన్నారు. చాలా మ్యాచులలో ఇలాంటివి జరిగాయి అని చెప్పాలి. ఇక ఇటీవల ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో కూడా ఇలాంటిదే జరిగింది.  ఐపిఎల్ లో ఛాంపియన్ జట్టుగా పేరున్న ముంబై ఇండియన్స్ ఇక ఇప్పుడు ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో అదే రీతిలో  ప్రస్థానాన్ని కొనసాగిస్తుంది. ఒక్క ఓటమి కూడా లేకుండా జైత్రయాత్రను కొనసాగిస్తుంది. ఇప్పటికే హ్యాట్రిక్ విజయాలు సాధించిన ముంబై ఇండియన్స్ ఇటీవల యూపీ వారియర్స్ తో జరిగిన మ్యాచ్ లో కూడా విజయం సాధించి నాలుగు విజయాలతో పాయింట్లు పట్టికలో టాప్లో ఉంది.



 అయితే ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్ సమయంలో ఒక ఆసక్తికర ఘటన జరిగింది అని చెప్పాలి. అంజలి శ్రావణి 11 ఓవర్ వేసింది. ఈ క్రమంలోనే ఈ ఓవర్లో మూడో బంతిని హర్మన్ ప్రీత్ కౌర్ ఫ్లిక్ చేయాలని ప్రయత్నించింది. అయితే బంతి బ్యాట్ ను తాకకుండా నేరుగా ఆమె వెనకాల నుంచి వికెట్లను తాకింది. బెయిల్స్ కూడా వెలిగాయి. దీంతో వెనకాల ఉన్న కీపర్ ఒక్కసారిగా సంబరాల్లో మునిగిపోయింది.  కానీ ఆ తర్వాత వికెట్ల మీద నుంచి బెయిల్ కింద పడలేదు అని గ్రహించి ఇక తలకి చేతులు పట్టుకుని నిరాశలో మునిగిపోయింది. దీంతో హార్మన్ బ్రతికిపోయింది అని చెప్పాలి. ఇక అప్పటికి హార్మన్ ప్రీత్  ఎనిమిది పరుగులు మాత్రమే చేసింది ఆ తర్వాత ఎంతో దూకుడుగా ఆడి అర్థ సెంచరీ పూర్తి చేసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: