గత రెండు రోజులుగా రాహు హీరోయిన్ కృతి గార్గ్ కిడ్నాప్ విషయంపై సోషల్ మీడియాలో హడావిడి తెలిసిందే. ఇటీవల రాహు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కృతి గార్గ్ ముంబై నుండి ఓ క్రేజీ ఆఫర్ రావడంతో ఎగిరిగంతులేసుకుంటూ వెళ్లింది. ఇంతకీ ఆ ఫోన్ ఎవరు చేశారంటే అర్జున్ రెడ్డి డైరక్టర్ సందీప్ వంగా అని.. అతను ప్రభాస్ తో చేసే సినిమాలో హీరోయిన్ గా ఆమెను ఎంపిక చేసేందుకు మాట్లాడేందుకు మీట్ అవ్వాలని అన్నారట.

 

అయితే హైదరాబాద్ నుండి అమ్మడు ముంబై వెళ్లడం ఆ తర్వాత ఆమె ఫోన్ ఎత్తకపోవడం.. ఇవన్ని చూసి కృతి గార్గ్ ను కిడ్నాప్ చేశారంటూ రాహు సినిమా డైరక్టర్ సుబ్బు వేదుల పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చాడు. ఈ గొడవలో డైరక్టర్ సందీప్ వంగ పేరు వినపడటంతో అతని మీద అందరు ఫోకస్ పెట్టారు. సందీప్ వంగ నిజంగా ఆమెకు ఆఫర్ ఇచ్చేందుకు పిలిచాడా.. మరి ముంబై వెళ్లిన కృతి కనిపించకుండా ఎలా వెళ్లిందో అని ఒకటే హడావిడి చేశారు. తిరిగి ఆమె మళ్లీ లైన్ లోకి వచ్చేవరకు అంతా టెన్షన్ పడ్డారు.

 

సందీప్ వంగ పేరు చెప్పి తనని ఒక ఆకతాయి ముంబై దాకా రప్పించాడని.. ప్రభాస్ తో సినిమా ఆఫర్ అనగానే తనకి డౌట్ వచ్చిందని. అందుకే అతన్ని కలవలేదని చెప్పింది కృతి. అయితే ఈ గొడవలో సందీప్ వంగ, ప్రభాస్ పేర్లు హైలెట్ అవడంతో స్టార్ డైరక్టర్, స్టార్ హీరోల పేర్లు వాడుతూ ఇలా హీరోయిన్స్ ను మోసం చేస్తున్నారని తెలుస్తుంది. కృతి గార్గ్ మళ్లీ కనిపించేవరకు ఆమె కిడ్నాప్ వార్తలపై టాలీవుడ్ షాకింగ్ లో ఉంది. ఒకవేళ జరగరానిది ఏదైనా జరిగితే సందీప్ వంగా, ప్రభాస్ ఇద్దరు రిస్క్ లో పడే అవకాశం ఉండేది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: