14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న సెంద్ర బాబు హయాంలో ఆంధ్ర - తెలంగాణ, భారత్, ప్రపంచం ఇలా అన్ని చోట్ల శాంతి వెల్లివిరిసింది. ఎక్కడా నేరాలు-ఘోరాలు , హత్యలు, అత్యాచారాలు ఇలా ఏవి చోటు చేసుకోలేదు అని, ఆయన అంతటి గొప్ప మనిషి , గొప్ప కృషివలుడు ఎవరూ లేరని డప్పు కొట్టుకుంటున్నారు. అంతేకాదు ఇప్పుడు చోటుచేసుకుంటున్న పరిణామాలపై ప్రజలు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేయాలని హడావుడి చేస్తున్నాడు. అసలు జగన్ పాలనలో ప్రజల మాన, ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని, వెంటనే రాజీనామా చేయాలని పిలుపు ఇస్తున్నారు.
చీమ చిటుక్కుమన్నా, దానికి జగనే కారణం అంటూ నిందలు వేసేందుకు సిద్ధంగా ఉంటున్నారు. అర్జెంటుగా ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టి ప్రపంచ దేశాల అధ్యక్షులు అంతా కలిసి ఒక నిర్ణయం తీసుకుని జగన్ ను అధికారం నుంచి దూరం చేయాలని పెద్ద ఉద్యమం చేపట్టేందుకు సిద్ధమవుతున్నాడు. అవును నిజమే బాబు గారి హయాంలో భూతద్దం పెట్టి వెతికినా కనిపించని అభివృద్ధి అంతా ఇప్పుడు కనిపిస్తోందిగా ఇది నిజంగా బాబు గారి దృష్టిలో ఘోరమే. ఘోరాతి ఘోరమే.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి