మరి పళనిస్వామి ప్రభుత్వంపై వ్యతిరేకత లేకపోతే జనాలు డీఎంకేకు ఎందుకు ఓట్లేస్తామని అంటున్నారు ? ఎందుకంటే అసలు సమస్యంతా ఇక్కడే ఉందట. ప్రభుత్వాన్ని నడపటంలో పళనిస్వామి ప్రతివిషయంలోను బీజేపీపై ఆధారపడ్డారని మెజారిటి జనాలు అభిప్రాయపడుతున్నారట. జయ మరణం తర్వాత కేంద్రప్రభుత్వం తమిళనాడు రాజకీయాల్లోను, ప్రభుత్వంలోను విపరీతంగా జోక్యం చేసుకుంటోందన్నది వాస్తవం. రాజకీయపార్టీగా రాష్ట్రంలో ఎదగాలని అనుకోవటంలో తప్పులేదు. అయితే దశాబ్దాల పాటు డీఎంకే అయినా అన్నాడీఎంకే అయినా బీజేపీని కాలికింద తొక్కిపెట్టేశాయి. దాంతో కమలంపార్టీ ఉనికే లేకుండాపోయింది రాష్ట్రంలో. నిజానికి జనాలు కూడా ఉత్తరాధిపార్టీ అనే బీజేపీని దూరంగా పెట్టేశారు. అలాంటిది తమిళనాడు రాజకీయాల్లో పెరిగిపోయిన బీజేపీ పాత్రను, ప్రభుత్వంలో జోక్యాన్ని జనాలు సహించలేకపోతున్నారట.
ఈ నేపధ్యంలోనే బీజేపీ చేతిలో బంధీగా చిక్కుకున్న పళనిస్వామి అంటే జనాల్లో వ్యతిరేకత పెరిగిపోయింది. పళని చేతకాని తనంవల్లే ప్రభుత్వంలో బీజేపీ జోక్యం పెరిగిపోయిందనే మంటతోనే డీఎంకేకు ఓట్లేస్తామని జనాలు చెబుతున్నారట. బీజేపీ విషయంలో జనాభిప్రాయం విచిత్రంగా లేదు. క్షేత్రస్ధాయిలో జనాభిప్రాయం చూస్తుంటే అన్నాడీఎంకే గెలుపు అవకాశాలను బీజేపీయే దెబ్బకొట్టేట్లుంది చూస్తుంటే. మరి జనాల మూడ్ తెలిసిన తర్వాత కూడా పళనిస్వామి బీజేపీని ఎందుకు దూరంగా పెట్టలేదో అర్ధం కావటంలేదు. ఫలితాలు వెల్లడైన తర్వాత కానీ విషయం స్పష్టంగా తెలీదు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి