అయితే, ప్రస్తుతం మనం వినియోగించే 10, 20, 50, 100, 200, 500, 2000 రూపాయల నోట్లను ప్రింట్ చేయడానికి ఆర్ బీ ఐ ఎంత ఖర్చు చేస్తుందో తెలుసుకుందామా..? కరెన్సీ నోట్లకు ఉండే విలువకు ఆ నోట్లను ప్రింట్ చేయడానికి అయ్యే ఖర్చులో చాలా తేడా ఉంటుంది. ఒక్క వంద రూపాయల నోటును ముద్రించేందుకు ఆర్ బీ ఐ కి రెండు రూపాయల వరకు ఖర్చు అవుతుంది. అలాగే రెండు వందల నోటు ముద్రించేందుకు రూ. 2.93 ఖర్చు చేస్తారు. 200 రూపాయల నోటు పొడవు, వెడల్పు మధ్య నిష్పత్తి 66 X 146 mm² . రెండు వందల రూపాయల నోటుపై సాంచి స్థూపం చిత్రం కనిపిస్తుంది. అదే విధంగా ఐదు వందల రూపాయల నోటు ముద్రణకు ఆర్ బీ ఐకి రూ. 2.94 ఖర్చు చేస్తుంది. ఈ నోటుపై మనకు ఎర్రకోట చిత్రం కనిపిస్తుంది.
భారత్లో అత్యధిక విలువ కలిగిన కరెన్సీ నోటు 2000 రూపాయల నోటు. ప్రస్తుతం దీని ముద్రణను ఆర్ బీ ఐ నిలిపివేసింది. పాత నోట్ల రద్దు అనంతరం 2000 రూపాయల నోటును మొదటి సారిగా ఆర్బీఐ ముద్రించిన విషయం తెలిసిందే. ఈ రెండు వేల రూపాయల నోటు వెడల్పు, పొడవు నిష్పత్తి 66 X 166 mm² గా ఉంటుంది. ఈ నోటుపై ‘మంగళయాన్’ చిత్రం కనిపిస్తుంది. ఐదు వందల నోటును ముద్రించడం కోసం ఆర్బీఐ కి రూ. 3.54 ఖర్చు అవుతుంది.