మన దేశం ఎన్నో చారిత్రక, పురాతన దేవాలయాలకు నిలయం. ఎన్నో శతాబ్దాల కిందట నిర్మించినా ఇప్పటికీ చెక్కు చెదరని ఆలయాలు కొన్ని ఉంటే, ఇంకా కొన్ని ఆలయ పరంగా ఎంతో పురాణ విశిష్టతను కలిగి ఉన్నాయి. అయితే గుజరాత్ రాష్ట్రంలో ఉన్న ఆ శివాలయం మాత్రం శివుడికి నైవేద్యంగా భ్రతికి ఉన్న పీతలను నైవేద్యంగా సమర్పిస్తారు. మరి ఈ దేవాలయం ఎక్కడ ఉంది? అలా ఎందుకు చేస్తారు? అన్న ప్రశ్నలు వచ్చే ఉంటాయి.
సూరత్ గుజరాత్ రాష్ట్రంలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం. ప్రపంచ స్థాయి వ్యాపారం ఇక్కడ జరుగుతుంది. క్రీ.శ.9 వ శతాబ్దంలో మనుగడలోకి వచ్చిన సూరత్ ప్రపంచ వస్త్ర, వజ్రాల వ్యాపారానికి ప్రసిద్ధి. బ్రిటీష్ వారి కాలంలో సూరత్ వ్యాపారం ప్రపంచం నలుమూలలకు పాకింది. ఆధ్యాత్మిక పరంగా కూడా సూరత్ చాలా ప్రసిద్ది చెందినది. అందుకు నిదర్శనం గుజరాత్ సముద్రం తీరంలో ఉన్న శివాలయం. ఇక ఇక్కడ శివుడిని నమ్మకంతో ఆరాధిస్తే ఎలాంటి కోరికలనైనా తీర్చగలడని విశ్వసిస్తారు.
అయితే ఉమ్రాలో రామ్నాథ్ శివ ఘేలా దేవాలయంలో.. మహాశివుడికి పీతలను సమర్పిస్తే చెవులు ఆరోగ్యంగా ఉంటాయనే నమ్మకం భక్తులకు ఉంది. తమ చెవులకు వచ్చే అనారోగ్యాలు నయమవుతాయని అంటున్నారు. అలాగే భక్తుల కోరికలను తీర్చడంలో కూడా శివుడు ముందు ఉంటాడని ఇక్కడ చాలా మంది నమ్ముతారు. అందుకే భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి, పీతలను శివునికి సమర్పిస్తున్నారు.