ఓం నమో వేంకటేశాయ!!
• ఈరోజు శనివారం, 08.02.2020 ఉదయం 5 గంటల సమయానికి, తిరుమల: 18C°-28C°
• నిన్న 62,677 మంది భక్తులకు కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరస్వామి వారి దర్శన భాగ్యం లభించింది.
• వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో 13 కంపార్ట్మెంట్ లలో సర్వదర్శనం కోసం భక్తులు వేచి ఉన్నారు.
• ఈ సమయం శ్రీవారి సర్వదర్శనాని కి సుమారు 08 గంటలు పట్టవచ్చును.
• నిన్న 24,571 మంది భక్తులు స్వామి వారికి తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.
• నిన్న స్వామివారికి హుండీ లో భక్తులు సమర్పించిన నగదు ₹: 2.45 కోట్లు.
• నిన్న 17,988 మంది భక్తులకు శ్రీ పద్మావతి అమ్మవారి దర్శన భాగ్యం కలిగినది.
• శీఘ్రసర్వదర్శనం(SSD), ప్రత్యేక దర్శనం (ఆన్ లైన్ ₹:300/-), దివ్యదర్శనం (కాలినడక) వారికి శ్రీవారి దర్శనానికి సుమారుగా రెండు గంటల సమయం పట్టవచ్చును.
గమనిక:
• ₹:10,000/- విరాళం ఇచ్చు శ్రీవారి భక్తునికి శ్రీవాణి ట్రస్ట్ ద్వారా ఒక విఐపి బ్రేక్ దర్శన భాగ్యం కల్పించిన టిటిడి.
ఫిబ్రవరి విశేషాలు
• రేపు పౌర్ణమి గరుడ సేవ, శ్రీ రామకృష్ణ తీర్థ ముక్కోటి.
• ఫిబ్రవరి 21న గోగర్భ తీర్థంలోని క్షేత్రపాలకునికి మహాశివరాత్రి వేడుకలు.
శ్రీవేంకటేశ్వర సుప్రభాతం
కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే, ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికమ్
తా: కౌసల్యాదేవికి సుపుత్రుడవగు ఓ రామా! పురుషోత్తమా తూర్పు తెల్లవారుచున్నది. దైవ సంబంధములైన
ఆహ్నికములను చేయవలసియున్నది_కావున లెమ్ము స్వామి.