మీరు ముందుగా నాగదేవతలకు శుక్ల చవితి, శుక్ల పంచమి తిథులు, శుక్రవారం, ఆదివారం రోజులలో ఆరాధించాలి. ఇలాంటి పవిత్రమైన రోజులలో పూజలు చేస్తే మీకు ఎటువంటి దుష్ఫలితాలు ఉన్నా, వాటి నుండి బయటపడే అవకాశం ఉంటుంది. అదే విధంగా పౌర్ణమి, దశమి, ఏకాదశి, ద్వాదశి తిథులు, క్రిష్ణ పక్షాలు నాగదేవతల పూజలకు మంచివి కాదు. కాబట్టి అటువంటి సమయాల్లో పూజలు చేయకండి. నాగదోష ప్రభావాన్ని బట్టి మాత్రమే పరిహారాలు పాటించాల్సి ఉంటుంది. నాగదోషం తీవ్రంగా ఉంటే, మీకు దగ్గర్లోని దుర్గా మాత ఆలయంలో నిద్ర చేసి మరుసటి రోజున శివుని దర్శనం చేసుకుని, రాహు,కేతువుల పూజలు, దానధర్మాలు చేస్తే ఫలితం ఉంటుంది.
మరి కొంతమంది జీవితాలు అయితే పెళ్లి చేసుకున్న కొద్ది రోజులకే విడాకులు తీసుకోవడం జరుగుతుంటుంది. వివాహం అయిన మొదటి కొన్ని రోజులలో, విడాకులు తీసుకున్న జంట కన్నీళ్లు పెట్టుకోకుండా స్వయంవర పార్వతీ మంత్రాన్ని ప్రతిరోజూ పఠించవచ్చు. ఇది భార్యాభర్తల మధ్య మానసిక ఐక్యతను పెంచుతుంది. కాబట్టి మీరు ఆచారాలను పాటించడం వలన మీ వివాహ జీవితం ఎంతో సాఫీగాా ఆనందంగా తాగడానికి దోహదపడుతుంది. మనం ఏ పని చేసినాా ఎంతో భక్తిి శ్రద్ధలతో నమ్మకంతో చేయాలి అప్పుడే మంచి ఫలితం దక్కుతుంది.