శ్రీరాముడు కూడా ఈ స్తోత్రాన్ని పఠించాడు
ఆదిత్య స్తోత్రాన్ని మహర్షి అగస్త్యుడు రచించారు. శ్రీ వాల్మీకి రామాయణంలో శ్రీరాముడు రావణుడితో యుద్ధం చేయడానికి ముందు సూర్య భగవానుని ఆశీర్వాదం తీసుకున్నాడని, ఆదిత్య స్తోత్రాన్ని పఠించాడని ప్రస్తావించారు. ఈ స్తోత్రం జీవితంలో సానుకూల మార్పులను తెస్తుంది. గౌరవాన్ని తీసుకురాగలదు. మరి శ్రీరాముడు పఠించిన ఈ మంత్రానికి ఎంత పవర్ ఉందో తెలుసుకోవడం చాలా ముఖ్యం. హిందువులు అంతా శ్రీరాముడితో పాటు సూర్య భగవానుని కూడా దేవుడిగానే కొలుస్తారు.
ఆదిత్య స్తోత్రాన్ని ఉదయాన్నే చదవాలి. ఉదయాన్నే ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించడం ఉత్తమమైనది. ఉదయాన్నే తల స్నానం చేసిన తర్వాత రాగి పాత్రలో నీటిని తీసుకుని అందులో రోలి, అక్షత, ఎర్రటి పువ్వులు, బెల్లం వేసి సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించాలి. అర్ఘ్య సమర్పణ సమయంలో గాయత్రీ మంత్రాన్ని జపించండి. దీని తర్వాత సూర్యుడి ముందు శ్లోకం పఠించాలి. పఠించిన తరువాత సూర్య భగవానుడికి నమస్కారం చేయండి. మీరు ఆదివారం పారాయణం చేస్తుంటే, ఆ రోజు ఉప్పు తినకండి. మాంసం, మద్యం, ఉల్లిపాయలు, వెల్లుల్లి, ఆల్కహాల్ మొదలైన వాటికి దూరంగా ఉండండి. నిరంతరం ఏదైనా వ్యాధితో బాధపడుతుంటే అది తగ్గుతుంది. సమస్యలు కూడా సమాసిపోతాయి.
ప్రయోజనాలు
ఆదిత్య హృదయ్ స్తోత్రాన్ని పద్దతిగా పఠించడం ద్వారా సూర్యభగవానుని అనుగ్రహం లభిస్తుంది. ఇది జీవితంలో అపారమైన విజయాన్ని తెస్తుంది. కోరిక నెరవేరుతుంది. సమాజంలో గౌరవం, ప్రతిష్టలు పెరుగుతాయి. అన్ని వ్యాధులను దూరం చేస్తుంది. మనస్సు నుండి ఎలాంటి భయమైనా తొలగిపోయి వ్యక్తి ఆత్మవిశ్వాసంతో ఉంటాడు. ప్రతికూల ఆలోచనలను వదిలించుకోండి.