మన జీవితంలో మంచి జరగాలంటే ఉప్పు అనేది ఎంతో ఉపయోగపడుతుందని, ముఖ్యంగా వాస్తు దోషాల నివారణలో ఉప్పు మంచి ఫలితాలను ఇస్తుందని, వాస్తు నిపుణులు తెలియజేస్తున్నారు. ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని దూరం చేసుకోవడానికి పాజిటివ్ ఎనర్జీని పెంపొందించడానికి ఉప్పు ఎంతో ఉపయోగపడుతుందని అంటున్నారు. వాస్తు ప్రకారం ఉప్పుతో ఇంకా ఏ ప్రయోజనాలు ఉన్నాయో మనం తెలుసుకుందాం..! మనం ఒక ఎర్రటి వస్త్రాన్ని తీసుకొని ఆ వస్త్రంలో కొంత ఉప్పు తీసుకొని మూటకట్టి మన ఇంటి ముందు గుమ్మానికి కానీ, లేదంటే బిజినెస్ చేస్తున్నట్లయితే ఆ యొక్క షాపు ముందు లేదా ఆఫీసు ముందు ఆ ఉప్పు మూటను కట్టండి.

దీనివల్ల నెగిటివ్ ఎనర్జీ దూరమైపోతుంది. అలాగే  ఇలా చేయటం వల్ల జ్ఞానం మరియు అదృష్టం అనేది కూడా కలిసి వస్తాయని చెడు ప్రభావాలు దిష్టి వంటివి తొలగిపోతాయని వాస్తు నిపుణులు తెలియజేస్తున్నారు. మన ఇంట్లో ఎవరైనా అనారోగ్యం లేదా చాలా వీక్ నెస్ తో బాధపడుతున్నట్లైతే ఒక రాగి పాత్రలో ఉప్పు తీసుకొని దాన్ని తీసుకెళ్లి ఆ వ్యక్తి ఉండే   బెడ్రూంలో పెట్టండి. ఇలా చేయడం వల్ల తప్పకుండా మంచి ఫలితాలు కనిపిస్తాయని నిపుణులు తెలియ జేస్తున్నారు. అలాగే ఇంట్లో ఉన్నటువంటి వాస్తు దోషాలు తొలగిపోవాలంటే ఒక గ్లాసు ఉప్పును బాత్రూంలో ఉంచడం చాలా మంచిది. అలాగే ఇంట్లో ఉండేటువంటి నెగిటివ్ ఎనర్జీని   దూరం చేయడానికి, అనేక ఆటంకాలను తొలగించడానికి ఉప్పు ఎంతో ఉపయోగపడుతుందని తెలియజేస్తున్నారు. పురోగతి కూడా చాలా మంచిగా ఉంటుందని అంటున్నారు. ముఖ్యంగా ఉప్పు కు నెగిటివ్ ఎనర్జీ ని లాగే శక్తి ఉంటుంది. దీనివల్ల దృష్టి లోపాలు తొలగిపోతాయి. దృష్టి  మరియు అసూయ వంటి శక్తులను లాగే శక్తి ఉప్పుకు ఉంటుంది. అంతేకాకుండా మీరు ఎంత సంపాదించినా డబ్బులు నిలవ కుంటే  మాత్రం వెంటనే రాళ్ల ఉప్పు తో చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే సరిపోతుంది. అదేంటి అంటే ఒక కుండను తీసుకొని అందులో రాళ్ల ఉప్పు వేసి ఒకటవ  తేదీన మీకు వచ్చినటువంటి జీతం లేదా వ్యాపార లాభాలను ఒకరోజు ఆ కుండ లో ఉంచి మరుసటి రోజు తీసి ఖర్చు పెట్టుకోండి. దీని వల్ల మీకు చాలా లాభాలు కలుగుతాయి.  శ్రీ మహాలక్ష్మీ దేవి క్షీర సాగరం నుంచి అవతరించింది. సముద్రంలో ఉప్పు ఎక్కువగా ఉంటుంది కాబట్టి లక్ష్మీదేవికి ఉప్పు అంటే చాలా ఇష్టం. అలాగే మంగళవారం రాత్రి సమయంలో ఉప్పు తీసుకొని ఎర్రటి  వస్త్రంలో మూటకట్టి ఇంటిముందు కట్టాలి.

మరుసటి రోజు ఆ మూటను తీసుకెళ్లి ఏదైనా చెట్టు మొదల్లో వేస్తే మనం పట్టిందల్లా బంగారం అవుతుంది. అలాగే శుక్రవారం రోజున ఒక గాజు  గ్లాసు తీసుకుని అందులో ఫుల్లుగా సముద్రపు ఉప్పు వేసి, రెండు లవంగాలను కూడా వేసి మన ఇంటిలో ఒక మూల పెట్టండి.  ఇలా చేయడం వల్ల ఇంట్లో ఆర్థిక సమస్యలు తగ్గిపోతాయి.అందుకే కిరాణా కొట్టులో రాత్రి సమయంలో దీపాలు వెలిగించిన తర్వాత ఉప్పును  ఇవ్వమంటే ఇవ్వరు. ఎందుకంటే ఉప్పు ఇస్తే లక్ష్మీదేవి వెళ్ళిపోతుందని నమ్ముతారు.

మరింత సమాచారం తెలుసుకోండి: