శ్రేయస్ అయ్యర్... ప్రస్తుతం టీమిండియా లో కీలక బ్యాట్ మెన్   కొనసాగుతున్నారు. తనదైన మెరుపులు  మెరిపిస్తూ  అద్భుత ఇన్నింగ్స్ ఆడుతున్నాడు శ్రేయస్ అయ్యర్. టీం ఇండియా మిడిలార్డర్ కొరతను తీర్చేలా కనిపిస్తున్నాడు. అయితే తాజాగా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ పై మిడిలార్డర్ బ్యాట్స్మెన్ శ్రేయస్ అయ్యర్ ఆసక్తికర కామెంట్ చేశాడు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ చేతి వేలు విరిగి పోయాయి అంటూ శ్రేయస్ అయ్యర్ కామెంట్ చేశాడు. శ్రేయస్ అయ్యర్ ఇలా కామెంట్ చేయడం వెనక అసలు మేటర్ ఏమిటి అంటే... న్యూజిలాండ్తో జరుగుతున్న తొలి టెస్టు సందర్భంగా... టాస్ వేసే సమయంలో టీమిండియా డేరింగ్ అండ్ డాషింగ్ కెప్టెన్ విరాట్ కోహ్లీ మైదానంలో ఒక రకమైన స్టెప్ వేసాడు . 

 

 టీమిండియా లేజర్ ధరించి రెండు చేతులను చాచి విరాట్ కోహ్లీ మైదానంలో డాన్స్ చేశాడు. ఇక ఈ ఫోటోను బిసిసిఐ తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్  చేసింది. ఆ సమయంలో ఈ ఫోటోపై కామెంట్ పెట్టాలని బాగా వచ్చిన వాటిని... అక్కడ పేర్కొంటాము అంటూ అభిమానులకు తెలిపింది బీసీసీఐ. ఇక బీసీసీఐ పెట్టిన భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫోటో పై స్పందించిన మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ శ్రేయస్ అయ్యర్.. తనదైన శైలిలో కామెంట్ పెట్టాడు. విరాట్ కోహ్లీ చేతివేళ్ళు విరిగి పోయాయి అంటూ శ్రేయస్ అయ్యర్ కామెంట్ పెట్టాడు.శ్రేయాస్ అయ్యర్  ఈ ఫోటోకి అలా కామెంట్ పెట్టడం వెనుక కారణం ఏమిటి అంటే... ఈ ఫోటోలు విరాట్ కోహ్లీ రెండు చేతులు చాచి నట్లు ఉండగా... చేతివేళ్ళు మాత్రం కిందకు వేలాడుతూ ఉన్నాయి. 

 

 అందుకే శ్రేయస్ అయ్యర్ ఇలా కామెంట్ పెట్టి ఉండవచ్చు అని అనుకుంటున్నారు అందరు. ఇదిలా ఉంటే విరాట్ కోహ్లీ మైదానంలో డాన్స్ చేయడం కొత్తేమీ కాదు. ఎప్పుడు జోష్గా ఫుల్ ఎనర్జీతో ఉండే టీమిండియా డేర్ అండ్ డాషింగ్ కెప్టెన్ విరాట్ కోహ్లీ.. ఆనందం వస్తే చాలు మైదానంలో తెగ డాన్స్ లు  చేస్తూ అభిమానులను అలరిస్తున్నాయి. ఇక అటు అభిమానులు కూడా విరాట్ కోహ్లీ ఆటనే  కాదు విరాట్ కోహ్లీ డాన్సులు కూడా బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు

మరింత సమాచారం తెలుసుకోండి: