విజయోత్సాహంలో ఉన్న ఆస్ట్రేలియా జట్టుకు కీలక ఆటగాడు గాయం రూపంలో దూరం అయ్యే అవకాశాలు ఏర్పడడంతో ప్రస్తుతం భారీ షాక్ తగిలింది. ఆస్ట్రేలియా జట్టులో ఆల్ రౌండర్ గా అద్భుతమైన ప్రదర్శన చేస్తూ జట్టులో కీలక ఆటగాడిగా తన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్న ఆల్రౌండర్ మార్కస్ స్టాయినిస్ నిన్న జరిగిన వన్డే మ్యాచ్ లో గాయం బారిన పడ్డాడు. ఈ నేపథ్యంలో రెండో వన్డేలో స్టాయినిస్ మ్యాచ్ ఆడతాడా లేదా అన్నది కూడా అనుమానం గా మారిపోయింది. భారత్ లక్ష్య ఛేదనలో బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఏడోవ ఓవర్లో రెండో బంతి విసిరిన సమయంలో నొప్పితో బాధ పడ్డాడు. దీంతో వెంటనే మైదానం వెళ్లిపోగా ఆ తర్వాత మాక్స్వెల్ ఓవర్ పూర్తి చేయాల్సి వచ్చింది.
అయితే స్టాయినిస్ కు ఎడమ భాగంలో నొప్పిగా ఉన్నట్లు ప్రస్తుతం సమాచారం. గాయం తీవ్రతను తెలుసుకోవడానికి ప్రస్తుతం వైద్యులు అతని పరీక్షిస్తున్నారని.. ఈ క్రమంలోనే అతని గాయం తీవ్రతరం అయితే ఇక రెండో వన్డే కి దూరమయ్యే అవకాశం ఉంది అని సమాచారం. దీంతో ఆస్ట్రేలియా జట్టు భారీ షాక్ తగలబోతోంది. కాగా ఐపీఎల్ ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడిన స్టాయినిస్ ఫైనల్ చేరడంలో కీలకపాత్ర వహించాడు అని చెప్పాలి. మొన్నటివరకు ఐపీఎల్లో ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన స్టాయినిస్ ప్రస్తుతం ఆస్ట్రేలియా జట్టులో కూడా అదరగొడుతున్నారు.