ప్రస్తుతం క్రికెట్ ఆటగాళ్లకు సోషల్ మీడియాలో ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు అన్న విషయం తెలిసిందే. ఏ  విషయానికి సంబంధించిన సరే సోషల్ మీడియా లో ఏదైనా పోస్టు పెట్టారు అంటే అది క్షణాల వ్యవధిలో వైరల్ గా మారిపోతూ ఉంటుంది. అయితే క్రికెట్ ఆటగాళ్లు మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఎంత సీరియస్గా ఉంటారో  ఇక మ్యాచ్ లేని సమయంలో మైదానంలో అంతే సరదాగా గడుపుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఒకరిపై ఒకరు పంచులు వేసుకుంటూ సరదా సరదాగా గడుపుతూ ఉంటారు. ఇలా ఆటగాళ్లు మైదానంలో సరదాగా గడుపుతున్న కొన్ని సంఘటనలకు సంబంధించిన వీడియోలు ఫోటోలు కూడా కొన్నిసార్లు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంటాయి.




 ఇక ఇటీవలే రోహిత్ శర్మ కు సంబంధించిన ఒక ఫోటో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉండడం గమనార్హం. ఇటీవలే భారత్ ఇంగ్లాండ్ మధ్య మోతెర  స్టేడియం వేదికగా మూడో వన్డే మ్యాచ్ జరిగింది. ఈ టెస్ట్ మ్యాచ్లో భారత జట్టు ఘన విజయాన్ని అందుకుంది. ఇక అప్పటి నుంచీ మోతెర  పిచ్ పై  ఇంగ్లాండ్ ఆటగాళ్లు అందరు కూడా పిచ్ టెస్ట్ క్రికెట్ కు సరైనది కాదు అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు అనే విషయం తెలిసిందే. ఇలాంటి నేపథ్యంలోనే ఇదే సంఘటనను ఉద్దేశిస్తూ ఇటీవలే టీం ఇండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ ఒక ఆసక్తికర ఫోటో సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.




 ప్రాక్టీస్ సెషన్ లో భాగంగా రోహిత్ శర్మ మైదానంలో పచ్చిక  పై పడుకొని రెస్ట్ తీసుకుంటున్నట్లు గా ఉన్నాడు. ఈ క్రమంలోనే పిచ్  ఎలా ఉంటుందో అని ఆలోచిస్తున్నా అంటూ రోహిత్ శర్మ ఒక పోస్ట్ పెట్టాడు. ఇక ఈ పోస్టు కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారగా ఇక ఈ పోస్ట్ పై స్పందించిన రోహిత్ శర్మ భార్య రితిక... నేను ఇలాగే ఉంటే లేజీ  అంటూ ఎప్పుడు ఎగతాళి చేస్తూ ఉంటావు అంటూ ఒక క్యాప్షన్ రిప్లై ఇచ్చింది. దీంతో ప్రస్తుతం వీరిద్దరికీ సంబంధించిన పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి. ఇకపోతే ప్రస్తుతం భారత జట్టు ఇంగ్లండ్ జట్టుతో కలిసి టెస్ట్ సిరీస్ తో పాటు టీ20 వన్డే సిరీస్ కూడా ఆడేందుకు సిద్దం అవుతుంది అన్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: