ఈ క్రమంలో రాస్సీ వాన్ 60 బంతుల్లో 94 పరుగులు చేయగా మార్క్రామ్ 25 బంతుల్లో 52 పరుగులతో చెలరేగిపోయాడు. దాంతో సౌత్ ఆఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 189 పరుగులు చేయగలిగింది. ఇక ఇంగ్లాండ్ బౌలర్లలో మొయిన్ అలీ, ఆదిల్ రషీద్ ఇద్దరు స్పిన్నర్ లే ఒక్కో వికెట్ ను తమ ఖాతాలో వేసుకున్నారు. అయితే ఈ మ్యాచ్ లో గెలవాలంటే ఇంగ్లండ్ జట్టు 190 చేయాలి. కానీ ఆ భారీ లక్ష్యాన్ని సౌత్ ఆఫ్రికా బౌలర్లు ఎదుర్కొని చేయగలదా అనేదే ప్రశ్న. అయితే ఇప్పటివరకు ఈ ప్రపంచ కప్ టోర్నీలో ఇంగ్లాండ్ జట్టు ఒక్క మ్యాచ్లో కూడా ఓడిపోలేదు. కానీ ఈ మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా భారీ పరుగుల తేడాతో విజయం సాధిస్తే ఆస్ట్రేలియ ను వెనక్కినెట్టి సెమీస్ కు క్వాలిఫై అవుతుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి