సౌత్ ఆఫ్రికా ఇండియాతో జరిగిన వన్ డే మరియు టెస్ట్ సీరిస్ ను గెలుచుకుని ఆత్మవిశ్వాసంతో కివీస్ పర్యటనకు వెళ్ళింది. ఈ సీరీస్ లో బాగంగా రెండు టెస్ట్ లు ఆడనుంది. మొదటి టెస్ట్ ఫిబ్రవరి 17 నుండి క్రిస్ట్ చర్చ్ వేదికగా మొదలు కాగా, రెండవ టెస్ట్ ఫిబ్రవరి 25 న జరగనుంది. అయితే మొదటి టెస్ట్ లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. అలా మొదటి ఇన్నింగ్స్ ప్రారంభించిన సౌత్ ఆఫ్రికా కివీస్ బౌలర్ ల దాటికి వరుస వికెట్లు కోల్పోయి 95 పరుగులకు కుప్పకూలింది. న్యూజిలాండ్ బౌలర్ లలో మాట్ హెన్రీ అద్భుతమైన బౌలింగ్ ప్రతిభను కనబరిచాడు. మొత్తం 7 వికెట్లు తీసి సౌత్ ఆఫ్రికా నడ్డి విరిచాడు.

ఆ తర్వాత కివీస్ తన మొదటి ఇన్నింగ్స్ లో  482 పరుగులు చేసి సఫారీల ముందు 387 పరుగుల లోటును ఉంచింది. అయితే రెండవ ఇన్నింగ్స్ లోనూ సఫారీల రాత మారలేదు. ఈ సారి సీనియర్ బౌలర్ టీమ్ సౌతీ పేస్ కు దాసోహం అంది. అయితే మొదటి ఇన్నింగ్స్ కన్నా కొంచెం మెరుగ్గా ఆడిందని చెప్పాలి. ఈ సారి 111 పరుగులు చేసింది. కివీస్ ఇన్నింగ్స్ 276 పరుగుల భారీ తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. అంతే కాకుండా అయిదు రోజుల పాటు జరగాల్సిన టెస్ట్ కేవలం రెండున్నర రోజులకే ముగిసిపోవడం విశేషం.

మరి రెండవ టెస్ట్ లో అయినా సౌత్ ఆఫ్రికా పుంజుకుని రెండు టెస్ట్ ల సీరీస్ ను సమం చేస్తుందా లేదా కివీస్ చేతిలో క్లీన్ స్వీప్ కు గురవుతుందా అన్నది తెలియాలంటే ఫిబ్రవరి 25 వరకు వెయిట్ చేయాల్సిందే. ఎందుకంటే ఇండియా తో టెస్ట్ సిరీస్ లోనూ మొదటి టెస్ట్ ఓడిపోయినా తర్వాత పుంజుకుని ఏకంగా వరుసగా రెండు టెస్ట్ లు గెలుచుకుని సిరీస్ ను చేజిక్కించుకుంది. మరి అలా ఏమైనా జరుగుతుందా లేదా అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: