ఐపీఎల్ సీజన్ లో భాగంగా నిన్న గుజరాత్ టైటాన్స్ రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరిగింది అన్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో భాగంగా ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఎనిమిది ఓవర్ లో పరుగు కోసం ప్రయత్నించిన రాజస్థాన్ కెప్టెన్ సంజూ శాంసన్ ను రనౌట్ చేసేందుకు గుజరాత్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా త్రో విసరడం అది నేరుగా వికెట్లకు తగలడం.. ఇక మిడిల్ వికెట్ ఒక్కసారిగా విరిగిపోయి రెండు ముక్కలు కావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే ఇక హార్దిక్ పాండ్యా ఇలా  వికెట్ విరగొట్టడం కారణంగా అటు ఐపీఎల్  నిర్వహణ అధికారులకు మాత్రం ఏకంగా 45 లక్షల వరకు లాస్ వచ్చింది అని తెలుస్తోంది.



 హార్దిక్ పాండ్యా ఎక్కడ ఉద్దేశపూర్వకంగా ఈ పని చేయకపోవడం వల్ల ఐపీఎల్ నిర్వాహకులకు ఈ నష్టం భరించ నున్నారు. అయితే ఆధునిక టెక్నాలజీని ఉపయోగించి తయారుచేసే ఎల్ఈడి వికెట్ల ఖరీదు 45 లక్షల వరకు ఉంటుంది. మొత్తం టీమ్ ఇండియా మ్యాచ్ ఫీజుకు దగ్గరగా ఉంటుంది అని చెప్పాలి. టీమిండియా వన్డే మ్యాచ్ ఆడితే 60 లక్షలు లభిస్థాయి. టి20 మ్యాచ్ ఆడితే 33 లక్షల రెమ్యునరేషన్  వస్తుంది. 2013లో ఎల్ఈడి సిస్టమ్స్ వినియోగం లోకి రాగా.. ఇలాంటి ఘటనలు చాలా అరుదుగా జరుగుతూ ఉంటాయి. ఇక ఐసిసి నిబంధనల ప్రకారం ఏదైనా ఆటగాడి వల్ల ఎల్ఈడి వికెట్స్ కి నష్టం వాటిల్లితే ఖర్చు నిర్వాహకులే భరించాల్సి ఉంటుంది.



 ఈ క్రమంలోనే ఇటీవల హార్దిక్ పాండ్యా అనుకోకుండా చేసిన పని కారణంగా ఏకంగా ఐపీఎల్ నిర్వాహకులకు 45 లక్షల వరకు నష్టం వాటిల్లింది.  మ్యాచ్ విషయానికి వస్తే రాజస్థాన్ రాయల్స్ పై 37 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది గుజరాత్ అని చెప్పాలి. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ 193 పరుగులు చేయగా.. ఇక ఆ తరువాత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి ఒక 155 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో గుజరాత్ టైటాన్స్ జట్టు విజయఢంకా మోగించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: