దీనితో బెంగళూర్ ప్లే ఆప్ ఆశలు గల్లంతు అయ్యేలా ఉన్నాయి. ఎందుకంటే... ఇక బెంగళూర్ కు మిగిలింది ఒకే ఒక్క మ్యాచ్ కావడం అందులోనూ ఆ మ్యాచ్ కూడా ఇప్పటికే ప్లే ఆఫ్ కు చేరుకున్న గుజరాత్ టైటాన్స్ తో కావడంతో బెంగళూర్ అభిమానులు నిరాశలో ఉన్నారు. కనీసం ప్లే ఆఫ్ బరిలో నిలవాలంటే లాస్ట్ మ్యాచ్ లో గుజరాత్ పై భారీ తేడాతో గెలవాలి అప్పుడే ఏమైనా అవకాశాలు ఉంటాయి. మరి ఏమి జరుగుతుందో చూడాల్సి ఉంది. ఇక పంజాబ్ ఈ మ్యాచ్ లో విజయంతో ఏకంగా 8 వ స్థానం నుండి 6 వ స్థానానికి చేరుకోవడంతో పాటు రన్ రేట్ ను కూడా అమోఘంగా మెరుగుపరుచుకుంది.
ఇక మిగిలిన రెండు మ్యాచ్ లలోనూ ఇదే విధమైన ప్రదర్శన కనబరిస్తే పంజాబ్ ప్లే ఆఫ్ చేరడం పక్కా. మరి మిగతా మ్యాచ్ ల మీద కూడా ఆధారపడుతుంది. మరి తర్వాత జరిగే గుజరాత్ మ్యాచ్ లో ఏమి జరగనుందో చూడాలి.